బీసీల హక్కుల కోసం పోరాటం..

Published on

-Advertisement-

మన భారత్, మొగుళ్ళపల్లి:

బీసీలను రాజకీయంగా అణగదొక్కేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పన్నాగాలు పన్నుతోందని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ తీవ్రంగా ఆరోపించారు. గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కేంద్ర ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు.

దేశవ్యాప్తంగా కులగణన పూర్తికాకముందే డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచనను ఆయన ఖండించారు. కులగణన అనంతరం జనాభా దామాషా ప్రకారం బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. బీసీల రాజకీయ హక్కులను పరిరక్షించాలంటే ముందుగా కులగణన నిర్వహించి, ఆ తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన చేయాలని డిమాండ్ చేశారు.

మహిళా బిల్లు పేరుతో బీసీ మహిళలకు న్యాయం జరగకుండా కేంద్రం వ్యవహరిస్తోందని ఆరోపించిన మహేందర్ గౌడ్, చట్టసభల్లో కూడా బీసీ మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. స్థానిక సంస్థల తరహాలోనే అసెంబ్లీ, పార్లమెంట్‌లోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలకు సముచిత అవకాశాలు ఉండాలని స్పష్టం చేశారు.

గత 11 సంవత్సరాల బీజేపీ పాలనలో బీసీల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించిన ఆయన, ఇప్పుడు హామీలు ఇస్తున్నా ప్రజలు నమ్మరని అన్నారు. బీసీ వర్గాలపై జరుగుతున్న అన్యాయాన్ని వెలుగులోకి తీసుకువచ్చేందుకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో గ్రామ గ్రామాన ప్రచారం చేపడతామని వెల్లడించారు.

బీసీ సమాజం మొత్తం కలిసి తమ హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చిన ఆయన, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బీసీలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా డీలిమిటేషన్ చేయడం వల్ల ప్రయోజనం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

భరత నాట్యంలో మెరిసిన చిన్నారి.‌!

మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని మొట్లపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు బుధవారం...

ఆటో బోల్తా .. ఒకరి మృతి

మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి మండలంలో జరిగిన ఆటో ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో...

ఆ ఏటీఎంలో మృతదేహం..!

మన భారత్, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని విజయనగర్ కాలనీలో ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఏటీఎంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి...

విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై ఆగ్రహం..

మన భారత్, ఆదిలాబాద్:  విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిన పాటిల్ అనీల్ ఘటనపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి....

More like this

భరత నాట్యంలో మెరిసిన చిన్నారి.‌!

మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని మొట్లపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు బుధవారం...

ఆటో బోల్తా .. ఒకరి మృతి

మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి మండలంలో జరిగిన ఆటో ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో...

ఆ ఏటీఎంలో మృతదేహం..!

మన భారత్, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని విజయనగర్ కాలనీలో ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఏటీఎంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి...