విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై ఆగ్రహం..

Published on

-Advertisement-

మన భారత్, ఆదిలాబాద్: 
విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిన పాటిల్ అనీల్ ఘటనపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మృతదేహాన్ని మార్చురి వద్ద ఉంచిన సమయంలో మాజీ సర్పంచ్ క్రీష్ణ, ఉప సర్పంచ్ మంత్రి గంగారెడ్డి, మృతుని బంధువులు, మిత్రులు కలిసి ట్రాన్స్‌కో SE, CI అధికారులతో చర్చలు జరిపారు.

ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్లే ఈ విషాద ఘటన చోటుచేసుకుందని ఆరోపించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, మృతుని కుటుంబానికి తక్షణ ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు.

మాజీ సర్పంచ్ క్రిష్ణ రత్న ప్రకాష్ మాట్లాడుతూ, గ్రామాల్లో విద్యుత్ భద్రతపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సమస్యలపై ముందస్తు చర్యలు తీసుకుని ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత అధికారులదని పేర్కొన్నారు. ఉప సర్పంచ్ మంత్రి గంగారెడ్డి కూడా మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని, అవసరమైన సహాయం వెంటనే అందించాలని అధికారులను కోరారు.

ట్రాన్స్‌కో అధికారులు స్పందిస్తూ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు ఉంటాయని తెలిపారు.

ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. స్థానికులు పెద్ద సంఖ్యలో మార్చురి వద్దకు చేరుకుని మృతునికి నివాళులు అర్పించారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

భరత నాట్యంలో మెరిసిన చిన్నారి.‌!

మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని మొట్లపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు బుధవారం...

ఆటో బోల్తా .. ఒకరి మృతి

మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి మండలంలో జరిగిన ఆటో ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో...

ఆ ఏటీఎంలో మృతదేహం..!

మన భారత్, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని విజయనగర్ కాలనీలో ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఏటీఎంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి...

బీసీల హక్కుల కోసం పోరాటం..

మన భారత్, మొగుళ్ళపల్లి: బీసీలను రాజకీయంగా అణగదొక్కేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పన్నాగాలు పన్నుతోందని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్...

More like this

భరత నాట్యంలో మెరిసిన చిన్నారి.‌!

మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని మొట్లపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు బుధవారం...

ఆటో బోల్తా .. ఒకరి మృతి

మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి మండలంలో జరిగిన ఆటో ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో...

ఆ ఏటీఎంలో మృతదేహం..!

మన భారత్, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని విజయనగర్ కాలనీలో ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఏటీఎంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి...