మన భారత్, జయశంకర్ భూపాలపల్లి:
జిల్లాలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన ఎడ్ల అంజిరెడ్డి కుటుంబ సభ్యులను బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ ఆత్మీయంగా పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుడి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
వేముల మహేందర్ గౌడ్ మాట్లాడుతూ, ఎడ్ల అంజిరెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయనకు స్వర్గలోక ప్రాప్తి కలగాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పుతూ ఈ క్లిష్ట సమయంలో తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ భూపాలపల్లి నియోజకవర్గ కన్వీనర్ మోరే రవీందర్ రెడ్డి, కుటుంబ సభ్యులు మరియు స్థానికులు పాల్గొన్నారు. మృతుని స్మృతిని స్మరించుకుంటూ అందరూ ఘనంగా నివాళులు అర్పించారు.
రాజకీయ నాయకులకు శుభవార్త.!
మీరు స్థానిక వార్తలు పోస్ట్ చేయడానికి క్రింది ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
