ఆడ పిల్ల పుడుతుందని.. భార్య, ఇద్దరు కూతుళ్లను హత్య

Published on

-Advertisement-

మన భారత్, హన్మకొండ:

జిల్లాలోని ఐనవోలు మండలం పున్నేలు గ్రామ శివారులో అమానుష ఘటన చోటుచేసుకుంది. మళ్లీ ఆడపిల్ల పుడుతుందనే అనుమానంతో ఓ వ్యక్తి తన భార్యతో పాటు ఇద్దరు చిన్నారి కూతుళ్లను హత్య చేయడం కలకలం రేపింది.

పోలీసుల వివరాల ప్రకారం, అజారుద్దీన్ అనే వ్యక్తి తన భార్య ఫర్హాత్ (26), కూతుళ్లు ఉమేరా (8), అయేషా (6)తో కలిసి నివాసం ఉంటూ స్విమ్మింగ్ పూల్ నిర్వహిస్తున్నాడు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన తర్వాత కూడా తన భార్య గర్భం దాల్చిన సందర్భాల్లో ఆడపిల్ల పుడుతుందనే అనుమానంతో పలుమార్లు గర్భస్రావం చేయించినట్లు సమాచారం.

ఇటీవల ఫర్హాత్ మళ్లీ గర్భవతి కావడంతో మరోసారి అబార్షన్ చేయించుకోవాలని అజారుద్దీన్ ఒత్తిడి చేశాడు. అయితే దీనికి ఆమె నిరాకరించడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన అతడు దారుణానికి ఒడిగట్టాడు. భార్య, పిల్లలను తన స్విమ్మింగ్ పూల్ వద్దకు తీసుకెళ్లి అందులో తోసి హత్య చేసి, ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు.

అయితే ఫర్హాత్ తండ్రి అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు అజారుద్దీన్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో నేరాన్ని ఒప్పుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఈ దారుణ ఘటనతో ప్రాంతంలో తీవ్ర ఆందోళన నెలకొంది. మహిళల భద్రత, ఆడపిల్లలపై వివక్షపై మరోసారి చర్చ మొదలైంది.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి

Latest articles

వీజేఆర్ ఫౌండేషన్ సేవలు మరువలేనివి..

మన భారత్, నారాయణపేట: ఆత్మకూరు పట్టణంలోని ఆరవ వార్డులో నెలకొన్న త్రాగునీటి సమస్యకు వీజేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శాశ్వత పరిష్కారం...

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...

ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి...

More like this

వీజేఆర్ ఫౌండేషన్ సేవలు మరువలేనివి..

మన భారత్, నారాయణపేట: ఆత్మకూరు పట్టణంలోని ఆరవ వార్డులో నెలకొన్న త్రాగునీటి సమస్యకు వీజేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శాశ్వత పరిష్కారం...

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...