మన భారత్, తెలంగాణ :
హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (SATS) చైర్మన్, వనపర్తి జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షులు, మాజీ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి ని నాయకుడు సాయి చరణ్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. కౌన్సిలర్గా ఎన్నికైన సందర్భంగా ఈ భేటీ జరగడం విశేషం.

ఈ సందర్భంగా శివసేన రెడ్డి ఆయనను ఆత్మీయంగా అభినందించారు. కౌన్సిలర్గా ప్రజలకు సేవ చేయాలని సూచిస్తూ శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సత్కారం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని కౌన్సిలర్ తెలిపారు.

తన రాజకీయ ప్రయాణంలో క్లిష్ట సమయాల్లో అండగా నిలిచి మార్గనిర్దేశం చేస్తున్న శివసేన రెడ్డి ప్రోత్సాహం తనకు ఎంతో బలం ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, పార్టీ బలోపేతానికి కట్టుబడి పనిచేస్తానని స్పష్టం చేశారు.

ఈ భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. స్థానిక నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్న శివసేన రెడ్డి నాయకత్వాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.
