BiPC విద్యార్థులకు విస్తృత అవకాశాలు

Published on

-Advertisement-

మన భారత్, ఎడ్యుకేషన్:

ఇంటర్మీడియట్‌ లో BiPC (బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ) గ్రూప్ పూర్తి చేసిన విద్యార్థులకు ఉన్నత విద్యలో విస్తృత అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. మెడిసిన్ రంగం మాత్రమే కాకుండా వ్యవసాయం, పారామెడికల్, సైన్స్ రంగాల్లో అనేక కోర్సులు ఎంపిక చేసుకునే అవకాశం ఉంది.

BiPC పూర్తి చేసిన విద్యార్థులు ముఖ్యంగా NEET, TGEAPCET, ICAR వంటి ప్రవేశ పరీక్షల ద్వారా పలు ప్రముఖ కోర్సుల్లో చేరవచ్చు. NEET ద్వారా MBBS, BDS, ఆయుర్వేద (BAMS), హోమియోపతి (BHMS), అలాగే వెటర్నరీ సైన్స్ కోర్సుల్లో అడ్మిషన్లు పొందే అవకాశం ఉంటుంది.

అదేవిధంగా డిగ్రీ స్థాయిలో అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, ఫిషరీస్ వంటి కోర్సులకు కూడా ఇటీవలి కాలంలో మంచి డిమాండ్ ఉంది. వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న నేపథ్యంలో ఈ కోర్సులు పూర్తి చేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో మంచి అవకాశాలు లభిస్తున్నాయి.

ఇంకా ఆరోగ్య రంగంలో ఆసక్తి ఉన్న విద్యార్థులు నర్సింగ్,  జియోథెరపీ వంటి పారామెడికల్ కోర్సులను ఎంపిక చేసుకోవచ్చు. వీటితో పాటు సైన్స్ రంగంలో ముందుకు వెళ్లాలనుకునే విద్యార్థులు బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, ఫుడ్ టెక్నాలజీ, సైకాలజీ వంటి విభాగాల్లో BSc కోర్సులు చేయవచ్చు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, విద్యార్థులు తమ ఆసక్తి, సామర్థ్యాలను దృష్టిలో పెట్టుకుని సరైన కోర్సును ఎంపిక చేసుకుంటే భవిష్యత్తులో మంచి కెరీర్ అవకాశాలు పొందే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో సరైన ప్రణాళికతో ఉన్నత విద్యను కొనసాగించడం చాలా అవసరమని వారు చెబుతున్నారు.

Latest articles

అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె.!

మన భారత్, తెలంగాణ:  తెలంగాణలో ప్రజా రవాణాపై భారీ ప్రభావం చూపేలా ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టనున్నారు. ప్రభుత్వం...

కాంగ్రెస్ వైఖరిని ఖండించిన బీజేవైఎం..!

మన భారత్, ఆదిలాబాద్ : లోక్‌సభలో మహిళల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్...

ప్రయాణికులకు శుభవార్త.. 8 కొత్త రైళ్లు.!

మన భారత్, తెలంగాణ:  తెలంగాణ రాష్ట్రంలో రైల్వే సౌకర్యాలు మరింత విస్తరించాయి. కేంద్ర ప్రభుత్వం భాగంగా హైదరాబాద్ నగరం నుంచి...

సబ్-రిజిస్ట్రార్ లో అవినీతి చేపలు.!

మన భారత్, వరంగల్: వరంగల్‌లోని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో భారీ అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన అవినీతి...

More like this

అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె.!

మన భారత్, తెలంగాణ:  తెలంగాణలో ప్రజా రవాణాపై భారీ ప్రభావం చూపేలా ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టనున్నారు. ప్రభుత్వం...

కాంగ్రెస్ వైఖరిని ఖండించిన బీజేవైఎం..!

మన భారత్, ఆదిలాబాద్ : లోక్‌సభలో మహిళల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్...

ప్రయాణికులకు శుభవార్త.. 8 కొత్త రైళ్లు.!

మన భారత్, తెలంగాణ:  తెలంగాణ రాష్ట్రంలో రైల్వే సౌకర్యాలు మరింత విస్తరించాయి. కేంద్ర ప్రభుత్వం భాగంగా హైదరాబాద్ నగరం నుంచి...