మార్చి 15లోగా నామినేటెడ్ పోస్టుల భర్తీ: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

Published on

-Advertisement-

మన భారత్, తెలంగాణ:

వచ్చే నెల 15వ తేదీలోగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ఢిల్లీలో AICC పెద్దలతో రాష్ట్ర మంత్రులు, కీలక నాయకులు సమావేశమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై పార్టీ అధిష్ఠానం సంతృప్తి వ్యక్తం చేసినట్లు చెప్పారు. పార్టీ బలోపేతానికి తీసుకున్న చర్యలు సానుకూల ఫలితాలు ఇస్తున్నాయని పేర్కొన్నారు.

ఇక మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అంశంపైనా సమావేశంలో చర్చించినట్లు వెల్లడించారు. త్వరలోనే ఆయనతో సంప్రదింపులు జరిపి స్పష్టతకు వచ్చే ప్రయత్నం చేస్తామని తెలిపారు.

రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై మరో రెండు రోజుల్లో మళ్లీ చర్చలు జరగనున్నాయని, పార్టీ తుది నిర్ణయం అధిష్ఠానం ప్రకటిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్ర రాజకీయ పరిణామాల దృష్ట్యా నామినేటెడ్ పదవుల భర్తీకి వేగం పెంచుతున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు.

Latest articles

షాపు యజమానులపై పంచాయతీ ఆగ్రహం..

మొగుళ్లపల్లి, మన భారత్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో మద్యం షాపుల వద్ద పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో...

ట్రాఫిక్ సమస్యల నివారణకు కృషి..

మొగుళ్లపల్లి, మన భారత్: మొగుళ్లపల్లి మండల కేంద్రంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని గ్రామపంచాయతీ కీలక నిర్ణయం తీసుకుంది....

వీజేఆర్ ఫౌండేషన్ సేవలు మరువలేనివి..

మన భారత్, నారాయణపేట: ఆత్మకూరు పట్టణంలోని ఆరవ వార్డులో నెలకొన్న త్రాగునీటి సమస్యకు వీజేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శాశ్వత పరిష్కారం...

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

More like this

షాపు యజమానులపై పంచాయతీ ఆగ్రహం..

మొగుళ్లపల్లి, మన భారత్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో మద్యం షాపుల వద్ద పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో...

ట్రాఫిక్ సమస్యల నివారణకు కృషి..

మొగుళ్లపల్లి, మన భారత్: మొగుళ్లపల్లి మండల కేంద్రంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని గ్రామపంచాయతీ కీలక నిర్ణయం తీసుకుంది....

వీజేఆర్ ఫౌండేషన్ సేవలు మరువలేనివి..

మన భారత్, నారాయణపేట: ఆత్మకూరు పట్టణంలోని ఆరవ వార్డులో నెలకొన్న త్రాగునీటి సమస్యకు వీజేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శాశ్వత పరిష్కారం...