మన భారత్, తెలంగాణ:
వచ్చే నెల 15వ తేదీలోగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ఢిల్లీలో AICC పెద్దలతో రాష్ట్ర మంత్రులు, కీలక నాయకులు సమావేశమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై పార్టీ అధిష్ఠానం సంతృప్తి వ్యక్తం చేసినట్లు చెప్పారు. పార్టీ బలోపేతానికి తీసుకున్న చర్యలు సానుకూల ఫలితాలు ఇస్తున్నాయని పేర్కొన్నారు.

ఇక మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అంశంపైనా సమావేశంలో చర్చించినట్లు వెల్లడించారు. త్వరలోనే ఆయనతో సంప్రదింపులు జరిపి స్పష్టతకు వచ్చే ప్రయత్నం చేస్తామని తెలిపారు.
రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై మరో రెండు రోజుల్లో మళ్లీ చర్చలు జరగనున్నాయని, పార్టీ తుది నిర్ణయం అధిష్ఠానం ప్రకటిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్ర రాజకీయ పరిణామాల దృష్ట్యా నామినేటెడ్ పదవుల భర్తీకి వేగం పెంచుతున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు.
