పదో తరగతి అర్హతతో 28,740 ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే నియామకాలు!

Published on

-Advertisement-

మన భారత్, న్యూఢిల్లీ:

భారత తపాలా శాఖలో భారీ ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. పదో తరగతి అర్హత కలిగిన అభ్యర్థులకు శుభవార్తగా, ఇండియా పోస్టు గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 28,740 గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.

ఈ నియామకాల్లో రాత పరీక్ష ఉండదు. అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా మాత్రమే తుది ఎంపిక చేపడతారు. బ్రాంచ్ పోస్టు మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ABPM), డాక్ సేవక్ పోస్టులకు తమ సొంత గ్రామంలోని తపాలా శాఖలోనే పని చేసే అవకాశం ఉంటుంది.

అర్హతలు:

* పదో తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి

* సైకిల్ లేదా బైక్ నడపడం తెలిసి ఉండాలి

* వయస్సు: 18 నుంచి 40 ఏళ్ల మధ్య

* ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల వరకు వయోపరిమితి సడలింపు

దరఖాస్తు వివరాలు:

* దరఖాస్తు విధానం: ఆన్‌లైన్

* చివరి తేదీ: ఫిబ్రవరి 14, 2026 (రాత్రి 11.59 గంటల వరకు)

దరఖాస్తు ఫీజు:

* జనరల్ అభ్యర్థులకు రూ.100

* ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులకు ఫీజు లేదు

దరఖాస్తుల్లో ఏవైనా తప్పులు ఉంటే ఫిబ్రవరి 18, 19 తేదీల్లో సవరణలకు అవకాశం కల్పించారు.

జీతభత్యాలు:

BPM పోస్టులకు: నెలకు రూ.12,000 నుంచి రూ.29,380 వరకు

ABPM / డాక్ సేవక్ పోస్టులకు: నెలకు రూ.10,000 నుంచి రూ.24,470 వరకు

అభ్యర్థుల ఎంపిక పూర్తిగా పదో తరగతి మార్కులు మరియు రిజర్వేషన్ నిబంధనల ఆధారంగానే జరుగుతుంది. రాత పరీక్షలు, ఇంటర్వ్యూలు లేకపోవడంతో ఈ ఉద్యోగాలు నిరుద్యోగ యువతకు మంచి అవకాశంగా మారాయి.

Latest articles

షాపు యజమానులపై పంచాయతీ ఆగ్రహం..

మొగుళ్లపల్లి, మన భారత్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో మద్యం షాపుల వద్ద పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో...

ట్రాఫిక్ సమస్యల నివారణకు కృషి..

మొగుళ్లపల్లి, మన భారత్: మొగుళ్లపల్లి మండల కేంద్రంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని గ్రామపంచాయతీ కీలక నిర్ణయం తీసుకుంది....

వీజేఆర్ ఫౌండేషన్ సేవలు మరువలేనివి..

మన భారత్, నారాయణపేట: ఆత్మకూరు పట్టణంలోని ఆరవ వార్డులో నెలకొన్న త్రాగునీటి సమస్యకు వీజేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శాశ్వత పరిష్కారం...

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

More like this

షాపు యజమానులపై పంచాయతీ ఆగ్రహం..

మొగుళ్లపల్లి, మన భారత్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో మద్యం షాపుల వద్ద పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో...

ట్రాఫిక్ సమస్యల నివారణకు కృషి..

మొగుళ్లపల్లి, మన భారత్: మొగుళ్లపల్లి మండల కేంద్రంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని గ్రామపంచాయతీ కీలక నిర్ణయం తీసుకుంది....

వీజేఆర్ ఫౌండేషన్ సేవలు మరువలేనివి..

మన భారత్, నారాయణపేట: ఆత్మకూరు పట్టణంలోని ఆరవ వార్డులో నెలకొన్న త్రాగునీటి సమస్యకు వీజేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శాశ్వత పరిష్కారం...