కార్యకర్తలకు టాప్ ప్రాధాన్యం: జగన్

Published on

-Advertisement-

మన భారత్, ఆంధ్రప్రదేశ్:

ఆంధ్రప్రదేశ్‌లో దుర్మార్గపు పాలన కొనసాగిస్తున్న చంద్రబాబు నాయుడుకు ప్రజలు తప్పకుండా తగిన బుద్ధి చెబుతారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. పార్టీ కార్యకర్తలే బలమని, వచ్చే రోజుల్లో వారికే అత్యధిక ప్రాధాన్యం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

ఏడాదిన్నర కాలం తర్వాత మళ్లీ పాదయాత్ర చేపడతానని జగన్ ప్రకటించారు. రాష్ట్రంలోని 150 నియోజకవర్గాల్లో పర్యటిస్తూ చంద్రబాబు నడుపుతున్న తప్పుడు పాలనను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఇంట్లో ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ జరిగేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు చొరవ చూపాలని పిలుపునిచ్చారు.

గత పాలన సమయంలో కొవిడ్ మహమ్మారి కారణంగా పాలనపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి వచ్చిందని జగన్ గుర్తు చేశారు. అయినప్పటికీ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పని చేశామని తెలిపారు. ఇకపై పార్టీ 2.0 దశలో కార్యకర్తలకు మరింత ప్రాధాన్యం ఇస్తానని, ఇది తన హామీ అని జగన్ భరోసా ఇచ్చారు.

రానున్న రోజుల్లో పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసి, ప్రజల మధ్య బలంగా నిలబెట్టే బాధ్యత కార్యకర్తలదేనని ఆయన స్పష్టం చేశారు.

Latest articles

కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న బలం..

ఆదిలాబాద్‌లో కాంగ్రెస్‌కు భారీ బలం డీసీసీ అధ్యక్షుడు డా. నరేష్ జాదవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బీజేపీ నాయకులు కన్య...

గ్రామాల అభివృద్ధే రాష్ట్రాభివృద్ధికి పునాది: సర్పంచ్ నిఖిత

అమరుల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం సఖినాపూర్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్ర గీతాలాపనతో అమరవీరులకు నివాళులు...

అమరుల త్యాగ ఫలితమే స్వరాష్ట్రం..

కుచులాపూర్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జాతీయ పతాకావిష్కరణతో అమరవీరులకు నివాళులు – పారిశుద్ధ్య కార్మికులకు సేఫ్టీ...

తెలంగాణ సాధనలో యువత త్యాగాలు చిరస్మరణీయం

పల్లి (బి) గ్రామంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అమరవీరులకు నివాళులు అర్పించిన గ్రామ ప్రజలు మన భారత్,...

More like this

కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న బలం..

ఆదిలాబాద్‌లో కాంగ్రెస్‌కు భారీ బలం డీసీసీ అధ్యక్షుడు డా. నరేష్ జాదవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బీజేపీ నాయకులు కన్య...

గ్రామాల అభివృద్ధే రాష్ట్రాభివృద్ధికి పునాది: సర్పంచ్ నిఖిత

అమరుల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం సఖినాపూర్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్ర గీతాలాపనతో అమరవీరులకు నివాళులు...

అమరుల త్యాగ ఫలితమే స్వరాష్ట్రం..

కుచులాపూర్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జాతీయ పతాకావిష్కరణతో అమరవీరులకు నివాళులు – పారిశుద్ధ్య కార్మికులకు సేఫ్టీ...