బీజేపీతో కలిసేది లేదు: ఎంఐఎం అధినేత ఒవైసీ స్పష్టం

Published on

-Advertisement-

మన భారత్ తెలంగాణ: మహారాష్ట్రలో బీజేపీ లేదా ఎన్డీయేతో ఎలాంటి పొత్తు ఉండదని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తేల్చిచెప్పారు. తమ పార్టీ బీజేపీకి బీ టీమ్ కాదని స్పష్టం చేస్తూ, ఏ కూటమితోనూ కలిసి వెళ్లే ప్రశ్నే లేదని అకోట్లో స్పష్టమైన నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

మీడియాతో మాట్లాడుతూ మహారాష్ట్రలో ఎంఐఎం బలంగా ఎదిగిందని ఒవైసీ పేర్కొన్నారు. “మహారాష్ట్రలో 125 మంది కార్పొరేటర్లను మా పార్టీ టికెట్‌పై గెలిపించుకున్నాం. ఇందులో ముస్లింలతో పాటు హిందువులు కూడా ఉన్నారు. ఇది మా పార్టీపై అన్ని వర్గాల ప్రజలకు ఉన్న విశ్వాసానికి నిదర్శనం” అని అన్నారు.

ఎన్నికల నిర్వహణపై వస్తున్న ఆరోపణలను కూడా ఆయన తోసిపుచ్చారు. ఓటర్ల జాబితా విషయంలో ఎలాంటి సందేహాలు లేవని, జాబితాలను తాము స్వయంగా పరిశీలించి వెరిఫై చేశామని వెల్లడించారు. ప్రజాస్వామ్య విలువలు, మైనారిటీల హక్కుల పరిరక్షణే ఎంఐఎం ప్రధాన లక్ష్యమని మరోసారి స్పష్టం చేశారు.

భవిష్యత్ రాజకీయాల్లో సిద్ధాంతాల ఆధారంగానే ముందుకు వెళ్తామని, అవకాశవాద రాజకీయాలకు తాము దూరమని ఒవైసీ పేర్కొన్నారు. బీజేపీతో పొత్తు అనే ప్రచారానికి ఇకపై తావులేదని ఆయన వ్యాఖ్యలు స్పష్టమైన సంకేతంగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Latest articles

కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా..

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా -వెయ్యి రోజుల సంబరాలకు ముందు బీసీలకు ఇచ్చిన హామీలపై...

బీసీ మహిళా మంత్రి కొండా సురేఖకు ప్రోటోకాల్ వర్తించదా? రేవంత్ జీ

-సామాజిక న్యాయం అంటే ఇదేనా? రాహుల్ జీ -బీసీలను గౌరవించడమంటే బీసీ ప్రజా ప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించకపోవడమేనా? -ఫ్లెక్సీలో బీసీ మంత్రి...

బీఆర్ఎస్ 10 ఏళ్ల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే సమరభేరి డ్రామా

- కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము మన భారత్,మొగుళ్ళపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి...

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

More like this

కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా..

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా -వెయ్యి రోజుల సంబరాలకు ముందు బీసీలకు ఇచ్చిన హామీలపై...

బీసీ మహిళా మంత్రి కొండా సురేఖకు ప్రోటోకాల్ వర్తించదా? రేవంత్ జీ

-సామాజిక న్యాయం అంటే ఇదేనా? రాహుల్ జీ -బీసీలను గౌరవించడమంటే బీసీ ప్రజా ప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించకపోవడమేనా? -ఫ్లెక్సీలో బీసీ మంత్రి...

బీఆర్ఎస్ 10 ఏళ్ల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే సమరభేరి డ్రామా

- కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము మన భారత్,మొగుళ్ళపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి...