హైందవ ధర్మమే సనాతన ధర్మం.‌.

Published on

-Advertisement-

దేవాపూర్‌లో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా

మన భారత్ | తలమడుగు:

తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామ యువకులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా, స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా బీజేవైఎం మండల అధ్యక్షులు దాతాజీ కిరణ్ మాట్లాడుతూ… తన జ్ఞాన పరంపరతో భారత జాతిని జాగృతం చేసిన తాపసి స్వామి వివేకానందుడని కొనియాడారు. హైందవ ధర్మమే సనాతనం, నిత్యనూతనం అని ప్రపంచానికి చాటిన సాహసి ఆయనని పేర్కొన్నారు. తనువంతా దేశభక్తిని, మనసంతా ఆధ్యాత్మిక శక్తిని నింపుకొని జీవించిన శేముషీగా వివేకానందుడు భారత యువతకు మార్గదర్శకుడిగా నిలిచారని అన్నారు.

కర్మాచరణనే ఆశయంగా నడిచిన చైతన్యశీలి, దేశమే దేహంగా జీవించిన మహర్షి, తన వాగ్ధాటితో ప్రపంచాన్ని పాదాక్రాంతం చేసిన దేవర్షిగా స్వామి వివేకానందుడు చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని దాతాజీ కిరణ్ వ్యాఖ్యానించారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి శతనమస్సులు అర్పిస్తూ, జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో దేవాపూర్ గ్రామ సర్పంచ్ పొరండ్ల సంతోష్, ఉప సర్పంచ్ మేకల శ్రీరామ్‌తో పాటు అడెపు శ్రీనివాస్, శానం శ్రీనివాస్, గంధం నరేష్, శాగంటి లచ్చన్న, సంఘర్తి నారాయణ, గోనె శ్రీనివాస్, అనంతుల రమణయ్య, బర్ల వెంకటి, ఎల్లూరి ప్రవీణ్ రెడ్డి, కొంగల గణేష్, సంఘర్తి శ్రీనివాస్, శీర్ల స్వామి తదితరులు పాల్గొన్నారు. అలాగే దేవాపూర్ యువకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Latest articles

కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా..

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా -వెయ్యి రోజుల సంబరాలకు ముందు బీసీలకు ఇచ్చిన హామీలపై...

బీసీ మహిళా మంత్రి కొండా సురేఖకు ప్రోటోకాల్ వర్తించదా? రేవంత్ జీ

-సామాజిక న్యాయం అంటే ఇదేనా? రాహుల్ జీ -బీసీలను గౌరవించడమంటే బీసీ ప్రజా ప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించకపోవడమేనా? -ఫ్లెక్సీలో బీసీ మంత్రి...

బీఆర్ఎస్ 10 ఏళ్ల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే సమరభేరి డ్రామా

- కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము మన భారత్,మొగుళ్ళపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి...

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

More like this

కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా..

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా -వెయ్యి రోజుల సంబరాలకు ముందు బీసీలకు ఇచ్చిన హామీలపై...

బీసీ మహిళా మంత్రి కొండా సురేఖకు ప్రోటోకాల్ వర్తించదా? రేవంత్ జీ

-సామాజిక న్యాయం అంటే ఇదేనా? రాహుల్ జీ -బీసీలను గౌరవించడమంటే బీసీ ప్రజా ప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించకపోవడమేనా? -ఫ్లెక్సీలో బీసీ మంత్రి...

బీఆర్ఎస్ 10 ఏళ్ల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే సమరభేరి డ్రామా

- కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము మన భారత్,మొగుళ్ళపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి...