సర్పంచ్ ఏకగ్రీవమైతే.. ఆ రోజే ఉపసర్పంచ్ ఎన్నిక

Published on

-Advertisement-

సర్పంచ్ ఏకగ్రీవమైతే.. ఆ రోజే ఉపసర్పంచ్ ఎన్నిక

-పోలింగ్ దాకా ఆగొద్దు

-ఆఫీసర్లకు ఎస్ఈసీ ఆదేశాలు

మన భారత్, తెలంగాణ: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు మెంబర్లంతా ఏకగ్రీవమైతే ఉప సర్పంచ్ ఎంపిక కోసం పోలింగ్ తేదీ దాకా ఆగాల్సిన అవసరం లేదు. ఏరోజు ఏకగ్రీవమైనట్లు ప్రకటిస్తారో.. ఆరోజే ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారులకు కీలక సర్క్యులర్ జారీ చేసింది. సాధారణంగా పంచాయతీ ఎన్నికల్లో రెండు దశల్లో రిటర్నింగ్ ఆఫీసర్లు ఉంటారు. నామినేషన్ ల ప్రక్రియను స్టేజ్1 ఆఫీసర్ చూస్తే.. పోలింగ్, కౌంటింగ్, ఉప సర్పంచ్ ఎన్నికను స్టేజ్2 ఆఫీసర్ చూస్తారు. ఒక పంచాయతీలో అన్ని స్థానాలు ఏకగ్రీవమైనప్పుడు.. పోటీలో నిలిచిన అభ్యర్థుల జాబితా ప్రకటించిన వెంటనే, ఫలితాలను డిక్లేర్ చేస్తారు. ఇలా డిక్లేర్ చేసిన రోజే.. వెంటనే ఉప సర్పంచ్ ఎన్నికను కూడా పూర్తి చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. అయితే ఏదైనా ఒక్క వార్డులోనైనా పోటీ ఉండి, పోలింగ్ జరగాల్సి వస్తే మాత్రం.. పాత పద్ధతిలోనే పోలింగ్, కౌంటింగ్ పూర్తయ్యాక చివరలో ఉప సర్పంచ్ ఎన్నిక ఉంటుందని ఎస్ఈసీ స్పష్టం చేసింది.

Latest articles

ప్రతి గింజ కొనుగోలు చేయాలి: ఎమ్మెల్యే

మన భారత్, ఆదిలాబాద్ జిల్లా: ఆదిలాబాద్ జిల్లాలోని బజార్ హత్నూర్ మండల కేంద్రంలో మొక్కజొన్న రైతులకు ఉపశమనం కలిగించే విధంగా...

హైడ్రాను తొలగిస్తాం’.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

మన భారత్, తెలంగాణ: బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్...

చిన్నారుల్లో విద్యా నైపుణ్యాల పెంపు..

మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల్లో విద్యా నైపుణ్యాలను పెంపొందించడంలో కీలక...

అలెర్ట్.. 5 రోజులు వర్ష సూచన

మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న ఐదు రోజులపాటు పలు...

More like this

ప్రతి గింజ కొనుగోలు చేయాలి: ఎమ్మెల్యే

మన భారత్, ఆదిలాబాద్ జిల్లా: ఆదిలాబాద్ జిల్లాలోని బజార్ హత్నూర్ మండల కేంద్రంలో మొక్కజొన్న రైతులకు ఉపశమనం కలిగించే విధంగా...

హైడ్రాను తొలగిస్తాం’.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

మన భారత్, తెలంగాణ: బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్...

చిన్నారుల్లో విద్యా నైపుణ్యాల పెంపు..

మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల్లో విద్యా నైపుణ్యాలను పెంపొందించడంలో కీలక...