అయితే ఇప్పుడు పెళ్లి ముహూర్తాలే లేవు!

Published on

-Advertisement-

శుక్ర మూఢమితో మూడు నెలలు శుభకార్యాలకు బ్రేక్

మన భారత్, స్టేట్ బ్యూరో: వివాహాలు, గృహప్రవేశాలు, శుభకార్యాలు ప్లాన్ చేస్తున్న కుటుంబాలకు నిరాశ కలిగించే వార్త ఇదే. రాబోయే 83 రోజులపాటు ఒక్క మంచి ముహూర్తం కూడా లేదని పండితులు స్పష్టం చేస్తున్నారు. కారణం శుక్ర మూఢమి. ఈ మూఢమి ప్రభావం వచ్చే ఏడాది 2026 ఫిబ్రవరి 17 వరకు కొనసాగుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

నవంబర్ 26 నుంచి మాఘ బహుళ అమావాస్య (ఫిబ్రవరి 17) వరకు 83 రోజులపాటు శుక్రుడు, గురుడు సూర్యునికి అత్యంత సమీపంగా ఉండే ఈ కాలాన్ని మూఢ కాలంగా పరిగణిస్తారు. ఈ సమయంలో ఈ గ్రహాలు బలాన్ని కోల్పోతాయి కాబట్టి వివాహాలు, నూతన గృహప్రవేశాలు, విగ్రహ ప్రతిష్ఠలు వంటి శుభకార్యాలు నిర్వహించరని పండితులు వివరిస్తున్నారు. అయితే రోజువారీ పూర్తిచేయాల్సిన నిత్యకర్మలకు మాత్రం మూఢకాల ప్రభావం ఉండదని తెలిపారు.

ఈసారి మాఘమాసంలో కూడా శుభముహూర్తాలు లేవు!

ప్రతి సంవత్సరం మాఘమాసంలో పెళ్లిళ్ల హడావిడి ఉంచడానికి ఫంక్షన్ హాళ్లు, కమ్యూనిటీ హాళ్లు ఖాళీలు కూడా లేకుండా ఉండేవి. కానీ ఈసారి శుక్ర మూఢ కాలం మాఘమాసానికే పడటంతో పెళ్లి ముహూర్తాలు లేక బుకింగ్స్ నామమాత్రంగానే ఉన్నాయని హాళ్ల నిర్వాహకులు చెబుతున్నారు.

వివాహం ప్లాన్ చేస్తున్న జంటలు, కుటుంబాలు ఇప్పుడు ఫిబ్రవరి 18, 2026 తర్వాతే శుభముహూర్తాలను చూడాల్సి ఉంటుంది. అంటే దాదాపు మూడు నెలలపాటు శుభకార్యాలకు పూర్తి బ్రేక్.

Latest articles

నకిలీ ఫోన్‌పేతో రూ.7,610 మోసం.. ఇద్దరు నిందితులు అరెస్ట్

నకిలీ ఫోన్‌పేతో రూ.7,610 మోసం.. ఇద్దరు నిందితులు అరెస్ట్ మూడు నూనె డబ్బాలు కొనుగోలు చేసి నకిలీ చెల్లింపు.. దొంగ...

20 న మంత్రి జూపల్లి రాక..

ఎల్నినో ప్రభావంపై అప్రమత్తం.. జూలై 20న ఉట్నూరులో మంత్రి జూపల్లి పర్యటన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు, ప్రత్యామ్నాయ...

ఘనంగా అందెశ్రీ జయంతి..

జయ జయహే "తెలంగాణ" గీతంతో..తెలంగాణ ఆత్మగౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహోన్నతమైన వ్యక్తి అందెశ్రీ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన వేముల...

విద్యుత్ శాఖ నూతన ఏఈగా గుగులోతు నగేష్ ..

మొగుళ్ళపల్లి విద్యుత్ శాఖ నూతన ఏఈగా గుగులోతు నగేష్ బాధ్యతల స్వీకరణ -బాధ్యతలు చేపట్టిన ఏఈ గుగులోత్ నగేష్ ను...

More like this

నకిలీ ఫోన్‌పేతో రూ.7,610 మోసం.. ఇద్దరు నిందితులు అరెస్ట్

నకిలీ ఫోన్‌పేతో రూ.7,610 మోసం.. ఇద్దరు నిందితులు అరెస్ట్ మూడు నూనె డబ్బాలు కొనుగోలు చేసి నకిలీ చెల్లింపు.. దొంగ...

20 న మంత్రి జూపల్లి రాక..

ఎల్నినో ప్రభావంపై అప్రమత్తం.. జూలై 20న ఉట్నూరులో మంత్రి జూపల్లి పర్యటన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు, ప్రత్యామ్నాయ...

ఘనంగా అందెశ్రీ జయంతి..

జయ జయహే "తెలంగాణ" గీతంతో..తెలంగాణ ఆత్మగౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహోన్నతమైన వ్యక్తి అందెశ్రీ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన వేముల...