కామ్రేడ్ దాజి శంకర్ కృషి మారువలేనిది..

Published on

దాజి శంకర్ కృషి మారువలేనిది – సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి
ప్రజా సమస్యల పరిష్కారానికి జీవితాంతం పోరాడిన నేతకు ఘన నివాళి

మన భారత్, తాంసీ, నవంబర్ 10: ప్రజా సమస్యల పరిష్కారానికి జీవితాన్ని అర్పించిన నాయకుడు కామ్రేడ్ దాజీ శంకర్ కృషి మారువలేనిదని సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన 39వ వర్ధంతి సందర్భంగా తాంసీ మండలంలోని ఈదుల్లా సవర్గాం గ్రామంలో ఉన్న దాజీ శంకర్ స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ దాజీ శంకర్ ప్రజా ఉద్యమాలకు ప్రేరణనిచ్చిన మహనీయుడని పేర్కొన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని నేటి యువత, విద్యార్థులు, మహిళలు, రైతులు, కార్మికులు ప్రజా సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రజల హక్కుల కోసం నిస్వార్థంగా శ్రమించిన దాజీ శంకర్ తెలంగాణ రాజకీయ చరిత్రలో చిరస్మరణీయమని అన్నారు.

ఈ కార్యక్రమంలో AITUC కార్యదర్శి విలాస్, CPI నాయకులు దేవిదాస్, నళిని, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొని నివాళులర్పించారు. కార్యక్రమం అనంతరం దాజీ శంకర్ సేవలను స్మరించుకుంటూ నాయకులు ప్రజా సమస్యలపై అవగాహన చర్చలు జరిపారు.

Latest articles

హాస్టళ్లలో 1,433 పోస్టుల భర్తీ.. అసెంబ్లీలో మంత్రి సవిత ప్రకటన

మన భారత్, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ హాస్టళ్లలో ఖాళీగా ఉన్న 1,433 పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి సవిత అసెంబ్లీలో...

అక్రమంగా గంజాయి సాగు.. వ్యక్తి అరెస్ట్, రిమాండ్

మన భారత్, జైనథ్: బేల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్...

23న తెలంగాణ క్యాబినెట్ భేటీ.. బడ్జెట్ సమావేశాలపై చర్చకు అవకాశం

మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈ నెల 23న నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన...

పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు.. భారీ వాహనాలకు నో ఎంట్రీ

మన భారత్, ఆదిలాబాద్: పట్టణంలోని తాంసి బస్టాండ్ సమీపంలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్...

More like this

హాస్టళ్లలో 1,433 పోస్టుల భర్తీ.. అసెంబ్లీలో మంత్రి సవిత ప్రకటన

మన భారత్, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ హాస్టళ్లలో ఖాళీగా ఉన్న 1,433 పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి సవిత అసెంబ్లీలో...

అక్రమంగా గంజాయి సాగు.. వ్యక్తి అరెస్ట్, రిమాండ్

మన భారత్, జైనథ్: బేల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్...

23న తెలంగాణ క్యాబినెట్ భేటీ.. బడ్జెట్ సమావేశాలపై చర్చకు అవకాశం

మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈ నెల 23న నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన...