జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సిద్ధం.. రేపే పోలింగ్, పటిష్ఠ బందోబస్తు
హైదరాబాద్, నవంబర్ 7 ,మన భారత్: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకోసం అధికారులు 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. పోలింగ్ నిర్వహణలో 2,060 మంది సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు.
అధికారుల సమాచారం ప్రకారం, భద్రతా చర్యలలో భాగంగా 139 ప్రాంతాల్లో డ్రోన్ లతో పటిష్ఠ నిఘా ఏర్పాటు చేశారు. అదనంగా 226 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు గుర్తించబడి, వాటి వద్ద పారామిలిటరీ బలగాలతో కట్టుదిట్టమైన బందోబస్తు చేపట్టారు.
పోలింగ్ ప్రక్రియపై నేరుగా పర్యవేక్షణ కోసం జిహెచ్ఎంసి (GHMC) కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఏవైనా అనుకోని సంఘటనలు చెలరేగిన , ఉద్రిక్తతలను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక దళాలను సిద్ధంగా ఉంచారు.
ఓట్ల లెక్కింపు ఈ నెల 14న జరగనుంది. ఫలితాలు అదే రోజున వెలువడనున్నాయి.
