ముగిసిన ఎన్ఎస్ఎస్ శిబిరం..

Published on

వ్యక్తిగత మరుగుదొడ్లపై అవగాహన ర్యాలీతో ఎన్ఎస్ఎస్ శిబిరం ముగింపు

మన భారత్, తాంసి, నవంబర్ 7: ప్రభుత్వ జూనియర్ కళాశాల, తాంసి ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహించిన శీతాకాల ప్రత్యేక శిబిరం గురువారం విజయవంతంగా ముగిసింది. వామన్ నగర్ గ్రామంలో జరిగిన ముగింపు కార్యక్రమంలో వ్యక్తిగత మరుగుదొడ్ల ప్రాధాన్యతపై అవగాహన ర్యాలీని వాలంటీర్లు నిర్వహించారు.

వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి బహిర్భూమికి వెళ్లడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు వ్యక్తిగత మరుగుదొడ్ల అవసరం గురించి గ్రామ ప్రజలకు వివరించారు. ప్రతి కుటుంబం స్వచ్ఛతను కాపాడడంలో భాగంగా మరుగుదొడ్లు నిర్మించుకోవాలని, వాటిని వినియోగించడం ద్వారా గ్రామం ఆరోగ్యవంతంగా మారుతుందని సూచించారు.

ముగింపు కార్యక్రమంలో గ్రామ పటేల్ మారుతి పటేల్, భూమారెడ్డి, అశోక్, యశ్వంత్, పరశురాం, ఆకాష్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఎన్. సంతోష్, అధ్యాపకులు దేవేందర్, రమణ, తిరుపతిరెడ్డి, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల సేవాభావాన్ని గ్రామస్తులు అభినందించారు. స్వచ్ఛత స్ఫూర్తితో ముందుకు సాగాలని గ్రామ పెద్దలు సూచించారు.

Latest articles

హాస్టళ్లలో 1,433 పోస్టుల భర్తీ.. అసెంబ్లీలో మంత్రి సవిత ప్రకటన

మన భారత్, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ హాస్టళ్లలో ఖాళీగా ఉన్న 1,433 పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి సవిత అసెంబ్లీలో...

అక్రమంగా గంజాయి సాగు.. వ్యక్తి అరెస్ట్, రిమాండ్

మన భారత్, జైనథ్: బేల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్...

23న తెలంగాణ క్యాబినెట్ భేటీ.. బడ్జెట్ సమావేశాలపై చర్చకు అవకాశం

మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈ నెల 23న నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన...

పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు.. భారీ వాహనాలకు నో ఎంట్రీ

మన భారత్, ఆదిలాబాద్: పట్టణంలోని తాంసి బస్టాండ్ సమీపంలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్...

More like this

హాస్టళ్లలో 1,433 పోస్టుల భర్తీ.. అసెంబ్లీలో మంత్రి సవిత ప్రకటన

మన భారత్, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ హాస్టళ్లలో ఖాళీగా ఉన్న 1,433 పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి సవిత అసెంబ్లీలో...

అక్రమంగా గంజాయి సాగు.. వ్యక్తి అరెస్ట్, రిమాండ్

మన భారత్, జైనథ్: బేల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్...

23న తెలంగాణ క్యాబినెట్ భేటీ.. బడ్జెట్ సమావేశాలపై చర్చకు అవకాశం

మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈ నెల 23న నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన...