💰చెత్తలో నిధి..! యాచకురాలి దగ్గర నోట్ల కట్టలు..! 

Published on

-Advertisement-

మంగళూరులో సంచలన సంఘటన — ప్రజలు, పోలీసులు ఆశ్చర్యంలో!

మన భారత్, స్టేట్ బ్యూరో: కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు నగరంలో ఓ ఆశ్చర్యకర సంఘటన వెలుగుచూసింది. చెత్త కుప్పల దగ్గర సంవత్సరాలుగా నివసిస్తున్న ఓ యాచకురాలి దగ్గర లక్షల రూపాయల నగదు బయటపడటంతో ప్రాంతమంతా కలకలం రేగింది.

సమాచారం ప్రకారం, మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న ఆ మహిళ గత 13 ఏళ్లుగా నగరంలోని ఒక వీధి మూలలో చెత్త కుప్పల మధ్యే జీవిస్తోంది. స్థానికులు ఆమెను సురక్షిత స్థలానికి తరలించాలనే నిర్ణయంతో ముందుకొచ్చారు. అయితే ఆమె చేతిలో ఉన్న కొన్ని సంచులను గట్టిగా పట్టుకుని వదలకపోవడంతో అనుమానం కలిగింది.

ఆ సంచులను బలవంతంగా తెరిచి చూశే సరికి అందరూ షాక్ అయ్యారు. అందులో పాత నోట్లు, కొత్త నోట్లు, నాణేలు కలిపి భారీ మొత్తంలో డబ్బు కనిపించింది. స్థానికులు లెక్కించగా ఆ మొత్తము ఒక లక్ష రూపాయల కంటే ఎక్కువగా ఉన్నట్లు తేలింది.

వెంటనే ఈ విషయం పోలీసులకు తెలియజేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నగదును స్వాధీనం చేసుకున్నారు. యాచకురాలిని వైద్య పరీక్షల అనంతరం స్థానిక అనాథ శరణాలయానికి తరలించారు.

ప్రాంత ప్రజలు ఆశ్చర్యపోతూ — “ఎక్కడినుంచి ఈ డబ్బు వచ్చింది..? ఆమెకు ఎవరు ఇచ్చారు..? లేదా ఏదైనా కాలంగా భిక్షాటన ద్వారా సేకరించిందా?” అని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

పోలీసులు ప్రస్తుతం ఆ నగదు మూలం గురించి విచారణ ప్రారంభించారు. ఈ సంఘటనతో మంగళూరు నగరంలో పెద్ద చర్చ మొదలైంది.

Latest articles

బీటీ రోడ్డు ఏర్పాటుకు కృషి చేస్తా : ఎమ్మెల్యే అనిల్ జాదవ్

వడ్డాడి ప్రాజెక్టును పరిశీలించిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్.. గేట్ల మరమ్మతులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచనలు మన భారత్,...

హస్సేన్ హుస్సేన్ దైవ క్షేత్రం సర్వమత సమ్మేళనానికి ప్రతీక: ఎస్పీ అఖిల్ మహాజన్

మన భారత్, తలమడుగు: రుయ్యాడి గ్రామంలో ఘనంగా మొహరం వేడుకలు.. పటిష్ట బందోబస్తు ఏర్పాటు ఆదిలాబాద్ జిల్లా, జూన్ 26: తలమడుగు...

షార్ట్ సర్క్యూట్ పాలిచ్చే పాడి ఆవు మృతి..

ఇస్సిపేటలో షార్ట్ సర్క్యూట్‌తో పాలిచ్చే పాడి ఆవు మృతి రూ.80 వేల విలువైన పాడి ఆవు కోల్పోయిన రైతు ఆవేదన నష్టపరిహారం...

డ్రగ్స్ రహిత నిర్మాణానికి యువత భాగస్వామ్యం కావాలి

అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఘనంగా 5K రన్ – 2 వేల...

More like this

బీటీ రోడ్డు ఏర్పాటుకు కృషి చేస్తా : ఎమ్మెల్యే అనిల్ జాదవ్

వడ్డాడి ప్రాజెక్టును పరిశీలించిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్.. గేట్ల మరమ్మతులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచనలు మన భారత్,...

హస్సేన్ హుస్సేన్ దైవ క్షేత్రం సర్వమత సమ్మేళనానికి ప్రతీక: ఎస్పీ అఖిల్ మహాజన్

మన భారత్, తలమడుగు: రుయ్యాడి గ్రామంలో ఘనంగా మొహరం వేడుకలు.. పటిష్ట బందోబస్తు ఏర్పాటు ఆదిలాబాద్ జిల్లా, జూన్ 26: తలమడుగు...

షార్ట్ సర్క్యూట్ పాలిచ్చే పాడి ఆవు మృతి..

ఇస్సిపేటలో షార్ట్ సర్క్యూట్‌తో పాలిచ్చే పాడి ఆవు మృతి రూ.80 వేల విలువైన పాడి ఆవు కోల్పోయిన రైతు ఆవేదన నష్టపరిహారం...