అమర వీరుల త్యాగ ఫలమే ప్రశాంత జీవనం – సి.ఐ ఫణిధర్

Published on

-Advertisement-

మన భారత్, ఆదిలాబాద్:  జిల్లాలో నేడు నెలకొన్న ప్రశాంత వాతావరణం వెనుక అమర వీరుల త్యాగమే ఉన్నదని రూరల్ సి.ఐ ఫణిదర్ పేర్కొన్నారు. పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాల ముగింపు కార్యక్రమం సందర్భంగా బుధవారం తాంసి మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ నుండి బస్టాండ్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సి.ఐ ఫణిదర్ మాట్లాడుతూ ..ప్రజల రక్షణ కోసం, దేశ శాంతి భద్రతల కోసం ప్రాణాలు అర్పించిన పోలీసు అమరుల త్యాగం ఎప్పటికీ మరువరాదన్నారు. “వారి త్యాగ ఫలితమే మనం నేడు ప్రశాంత వాతావరణంలో జీవించగలుగుతున్నాం” అని పేర్కొన్నారు. పోలీసు వృత్తి కేవలం ఉద్యోగం కాకుండా ప్రజాహితమే ప్రధాన ధ్యేయమని తెలిపారు. ర్యాలీలో పాల్గొన్న పోలీసులు “అమర వీరుల జోహార్” అంటూ నినాదాలు చేస్తూ వీర స్ఫూర్తిని గుర్తు చేశారు. స్థానిక యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కొవ్వొత్తులు వెలిగించి అమరుల త్యాగాలకు నివాళులు అర్పించారు. సంఘటనా స్థలంలో తాంసి ఎస్ఐ జీవన్ రెడ్డి, పోలీస్ సిబ్బంది, గ్రామ ప్రజలు, యువకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

–✍️ మన భారత్, ఆదిలాబాద్

Latest articles

విద్యతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు

విద్యార్థులకు నోట్‌బుక్స్, స్కూల్ బ్యాగులు, వాటర్ బాటిల్స్ పంపిణీ పాల్దే ప్రసాద్ జన్మదినం సందర్భంగా అన్నపూర్ణ సేవా సంస్థ ట్రస్ట్...

విదేశీ ఉద్యోగం పేరుతో రూ.6.51 లక్షల మోసం

ఏజెంట్‌తో పాటు సహకరించిన వ్యక్తి అరెస్ట్.. 14 రోజుల రిమాండ్‌కు తరలింపు మన భారత్, ఆదిలాబాద్: విదేశాలలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ...

బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

కల్తీ కల్లు విక్రయించిన వ్యక్తికి రూ.50 వేల జరిమానా మన భారత్, ఆదిలాబాద్: బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించి తిరిగి చట్టవిరుద్ధ...

కాంగ్రెస్ అరాచకాలపై బీజేపీ పోరాటం ఆగదు

కాంగ్రెస్ అరాచకాలపై బీజేపీ పోరాటం ఆగదు -రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం -బీజేపీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు మోరే రవీందర్...

More like this

విద్యతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు

విద్యార్థులకు నోట్‌బుక్స్, స్కూల్ బ్యాగులు, వాటర్ బాటిల్స్ పంపిణీ పాల్దే ప్రసాద్ జన్మదినం సందర్భంగా అన్నపూర్ణ సేవా సంస్థ ట్రస్ట్...

విదేశీ ఉద్యోగం పేరుతో రూ.6.51 లక్షల మోసం

ఏజెంట్‌తో పాటు సహకరించిన వ్యక్తి అరెస్ట్.. 14 రోజుల రిమాండ్‌కు తరలింపు మన భారత్, ఆదిలాబాద్: విదేశాలలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ...

బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

కల్తీ కల్లు విక్రయించిన వ్యక్తికి రూ.50 వేల జరిమానా మన భారత్, ఆదిలాబాద్: బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించి తిరిగి చట్టవిరుద్ధ...