అమర వీరుల త్యాగ ఫలమే ప్రశాంత జీవనం – సి.ఐ ఫణిధర్

Published on

మన భారత్, ఆదిలాబాద్:  జిల్లాలో నేడు నెలకొన్న ప్రశాంత వాతావరణం వెనుక అమర వీరుల త్యాగమే ఉన్నదని రూరల్ సి.ఐ ఫణిదర్ పేర్కొన్నారు. పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాల ముగింపు కార్యక్రమం సందర్భంగా బుధవారం తాంసి మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ నుండి బస్టాండ్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సి.ఐ ఫణిదర్ మాట్లాడుతూ ..ప్రజల రక్షణ కోసం, దేశ శాంతి భద్రతల కోసం ప్రాణాలు అర్పించిన పోలీసు అమరుల త్యాగం ఎప్పటికీ మరువరాదన్నారు. “వారి త్యాగ ఫలితమే మనం నేడు ప్రశాంత వాతావరణంలో జీవించగలుగుతున్నాం” అని పేర్కొన్నారు. పోలీసు వృత్తి కేవలం ఉద్యోగం కాకుండా ప్రజాహితమే ప్రధాన ధ్యేయమని తెలిపారు. ర్యాలీలో పాల్గొన్న పోలీసులు “అమర వీరుల జోహార్” అంటూ నినాదాలు చేస్తూ వీర స్ఫూర్తిని గుర్తు చేశారు. స్థానిక యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కొవ్వొత్తులు వెలిగించి అమరుల త్యాగాలకు నివాళులు అర్పించారు. సంఘటనా స్థలంలో తాంసి ఎస్ఐ జీవన్ రెడ్డి, పోలీస్ సిబ్బంది, గ్రామ ప్రజలు, యువకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

–✍️ మన భారత్, ఆదిలాబాద్

Latest articles

హాస్టళ్లలో 1,433 పోస్టుల భర్తీ.. అసెంబ్లీలో మంత్రి సవిత ప్రకటన

మన భారత్, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ హాస్టళ్లలో ఖాళీగా ఉన్న 1,433 పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి సవిత అసెంబ్లీలో...

అక్రమంగా గంజాయి సాగు.. వ్యక్తి అరెస్ట్, రిమాండ్

మన భారత్, జైనథ్: బేల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్...

23న తెలంగాణ క్యాబినెట్ భేటీ.. బడ్జెట్ సమావేశాలపై చర్చకు అవకాశం

మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈ నెల 23న నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన...

పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు.. భారీ వాహనాలకు నో ఎంట్రీ

మన భారత్, ఆదిలాబాద్: పట్టణంలోని తాంసి బస్టాండ్ సమీపంలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్...

More like this

హాస్టళ్లలో 1,433 పోస్టుల భర్తీ.. అసెంబ్లీలో మంత్రి సవిత ప్రకటన

మన భారత్, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ హాస్టళ్లలో ఖాళీగా ఉన్న 1,433 పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి సవిత అసెంబ్లీలో...

అక్రమంగా గంజాయి సాగు.. వ్యక్తి అరెస్ట్, రిమాండ్

మన భారత్, జైనథ్: బేల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్...

23న తెలంగాణ క్యాబినెట్ భేటీ.. బడ్జెట్ సమావేశాలపై చర్చకు అవకాశం

మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈ నెల 23న నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన...