ఆదిలాబాద్ జిల్లాలో కవిత పర్యటనకు ఏర్పాట్లు

Published on

-Advertisement-

ఆదిలాబాద్ పర్యటనకు సిద్ధమైన జాగృతి అధ్యక్షురాలు కవిత.. నవంబర్ 3, 4న ‘జాగృతి జనం బాట’ కార్యక్రమంలో పాల్గొననున్నారు

మన భారత్, ఆదిలాబాద్: తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నవంబర్ 3, 4 తేదీల్లో ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ‘జాగృతి జనం బాట’ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని పలు మండలాలను సందర్శించి, మేధావులు, ఉద్యమకారులు, విద్యార్థులు, యువతతో భేటీ కానున్నారు. ఈ వివరాలను జాగృతి జిల్లా అధ్యక్షుడు రంగినేని శ్రీనివాస్ మీడియాకు తెలిపారు. కవిత పర్యటన సందర్భంగా జాగృతి కార్యకర్తలతో సమావేశమై, సంస్థ భవిష్యత్ కార్యకలాపాలపై సూచనలు ఇవ్వనున్నారని ఆయన చెప్పారు. జిల్లాలో ఎక్కడా కొత్త కమిటీలు ఏర్పాటు కాలేదని, ఇప్పటికే ఉన్న పాత కమిటీ లే కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. కవిత పర్యటనతో ఆదిలాబాద్ జాగృతి కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నెలకొన్నదని ఆయన పేర్కొన్నారు. కవిత పర్యటన విజయవంతం కావడానికి జాగృతి సభ్యులు, నాయకులు ఇప్పటికే ఏర్పాట్లను ప్రారంభించినట్లు సమాచారం.

Latest articles

విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై ఆగ్రహం..

మన భారత్, ఆదిలాబాద్:  విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిన పాటిల్ అనీల్ ఘటనపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి....

విద్యుత్ షాక్‌తో అసిస్టెంట్ లైన్ మెన్ మృతి

మన భారత్, భీంపూర్: భీంపూర్ మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ మరమ్మతుల పనులు నిర్వహిస్తున్న సమయంలో అసిస్టెంట్ లైన్...

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ..

మన భారత్, మొగుళ్లపల్లి: మొగుళ్లపల్లి మండలంలోని పాత ఇస్సిపేట గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు, అరటి పండ్లు...

తులం బంగారం ఎప్పుడు ఇస్తారో..?

మన భారత్, తలమడుగు: కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలతో గద్దెనిక్కిందని కళ్యాణ లక్ష్మితో తులం బంగారం ఎప్పుడు ఇస్తారని ఆడపడుచులు...

More like this

విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై ఆగ్రహం..

మన భారత్, ఆదిలాబాద్:  విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిన పాటిల్ అనీల్ ఘటనపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి....

విద్యుత్ షాక్‌తో అసిస్టెంట్ లైన్ మెన్ మృతి

మన భారత్, భీంపూర్: భీంపూర్ మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ మరమ్మతుల పనులు నిర్వహిస్తున్న సమయంలో అసిస్టెంట్ లైన్...

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ..

మన భారత్, మొగుళ్లపల్లి: మొగుళ్లపల్లి మండలంలోని పాత ఇస్సిపేట గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు, అరటి పండ్లు...