హెల్మెట్ వెంటే నిర్లక్ష్యం..

Published on

హెల్మెట్ వెంటే నిర్లక్ష్యం.. బండికి తగిలించుకుని ప్రయాణం
మన భారత్, ఆదిలాబాద్: తాంసి మండలంలోని పొన్నారి గ్రామ శివారులో ద్విచక్ర వాహనదారుల నిర్లక్ష్య ప్రవర్తన మరోసారి బయటపడింది. స్థానిక రహదారిపై ఓ బైక్‌పై ప్రయాణిస్తున్న దంపతులు హెల్మెట్‌ను తలకు ధరించకుండా బండికి తగిలించుకుని వెళ్తున్న దృశ్యాలు మన భారత్ కెమెరాలో చిక్కాయి.రోడ్డు భద్రతా నిబంధనల ప్రకారం ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. కానీ ఇంకా చాలా మంది వాహనదారులు ఈ నిబంధనను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆదిలాబాద్తాంసి, పొన్నారి ప్రధాన రోడ్డుపై తీసిన ఈ ఫోటో రోడ్ భద్రత పట్ల ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. పోలీసులు తరచుగా జరిమానాలు విధిస్తూ, హెల్మెట్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తున్నా కూడా, కొందరు మాత్రం హెల్మెట్‌ను చేతిలో లేదా బండికి తగిలించుకుని వెళ్ళడం సాధారణంగా మారింది. “ప్రమాదం ఎప్పుడు ఎక్కడ ఎదురవుతుందో చెప్పలేం. హెల్మెట్ తలకు రక్షణగా ఉంటుంది. భద్రత కోసం అది తప్పనిసరిగా ధరించాలి” అని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ – “హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారిని చూసి భయం వేస్తుంది. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది” అని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు భద్రతా నిపుణులు సూచనల ప్రకారం ప్రతి ద్విచక్ర వాహనదారులు, వెనుక ప్రయాణికుడు కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. ఇది చట్టపరమైన కర్తవ్యమే కాకుండా ప్రాణ భద్రతకు రక్షణగా నిలుస్తుంది.

Latest articles

హాస్టళ్లలో 1,433 పోస్టుల భర్తీ.. అసెంబ్లీలో మంత్రి సవిత ప్రకటన

మన భారత్, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ హాస్టళ్లలో ఖాళీగా ఉన్న 1,433 పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి సవిత అసెంబ్లీలో...

అక్రమంగా గంజాయి సాగు.. వ్యక్తి అరెస్ట్, రిమాండ్

మన భారత్, జైనథ్: బేల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్...

23న తెలంగాణ క్యాబినెట్ భేటీ.. బడ్జెట్ సమావేశాలపై చర్చకు అవకాశం

మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈ నెల 23న నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన...

పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు.. భారీ వాహనాలకు నో ఎంట్రీ

మన భారత్, ఆదిలాబాద్: పట్టణంలోని తాంసి బస్టాండ్ సమీపంలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్...

More like this

హాస్టళ్లలో 1,433 పోస్టుల భర్తీ.. అసెంబ్లీలో మంత్రి సవిత ప్రకటన

మన భారత్, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ హాస్టళ్లలో ఖాళీగా ఉన్న 1,433 పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి సవిత అసెంబ్లీలో...

అక్రమంగా గంజాయి సాగు.. వ్యక్తి అరెస్ట్, రిమాండ్

మన భారత్, జైనథ్: బేల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్...

23న తెలంగాణ క్యాబినెట్ భేటీ.. బడ్జెట్ సమావేశాలపై చర్చకు అవకాశం

మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈ నెల 23న నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన...