అర్ధరాత్రి ఇసుక అక్రమ దందా ఆగేనా..

Published on

-Advertisement-

అర్ధరాత్రి ఇసుక దందా బీభత్సం..!
ఇందిరమ్మ ఇళ్ల పేరుతో దోపిడీ – కలెక్టర్ ఆదేశాలపై అధికారుల నిర్లక్ష్యం

మన భారత్ ఆదిలాబాద్ : తాంసి మండలంలో రాత్రి వేళల్లో ఇసుక అక్రమ రవాణా జోరుగా కొనసాగుతోంది . ప్రభుత్వం ప్రజల గృహ కలలను సాకారం చేయాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ఇప్పుడు కొందరికి దోపిడీ ధారావాహికగా మారింది. అధికారుల నిర్లక్ష్యం, స్థానిక స్థాయిలో లబ్ధిదారుల పై పెరిగిన భారంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

భీంపూర్ మండలంలోని గోల్లఘాట్ నుంచి తాంసి మండల కేంద్రంతో పాటు కప్పర్ల, జామిడి, సవర్గాం గ్రామాలకు రోజూ రాత్రి వేళల్లో ఇసుక ట్రాక్టర్లు నిరభ్యంతరంగా తరలిస్తున్నట్లు స్థానికులు  చెబుతున్నారు. ఇంతకు ముందు ఒక్క ట్రాక్టర్ ఇసుక రూ.2,500కి లభించగా, ఇప్పుడు రూ.4,000 నుంచి రూ.5,000 వరకూ వసూలు చేస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు.

జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఇటీవల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం జీరో కాస్ట్ ఇసుక అందించాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, మండల, గ్రామ స్థాయి అధికారులు మాత్రం వాటిని పట్టించుకోకపోవడం గమనార్హం.

స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు — భీంపూర్ మండల రెవెన్యూ, పోలీస్ అధికారుల కనుసన్నల్లో  ఈ అక్రమ రవాణా ఎలా జరుగుతోంది? ఇసుక మాఫియాకు ఎవరూ అడ్డుకట్ట వేయరా? అని.

ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న పథకం నిజంగా పేదల గృహ నిర్మాణానికి ఉపయోగపడాలంటే అధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, అక్రమ ఇసుక రవాణాను అరికట్టి జీరో కాస్ట్ ఇసుకను లబ్ధిదారులకు అందేలా చూడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Latest articles

విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై ఆగ్రహం..

మన భారత్, ఆదిలాబాద్:  విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిన పాటిల్ అనీల్ ఘటనపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి....

విద్యుత్ షాక్‌తో అసిస్టెంట్ లైన్ మెన్ మృతి

మన భారత్, భీంపూర్: భీంపూర్ మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ మరమ్మతుల పనులు నిర్వహిస్తున్న సమయంలో అసిస్టెంట్ లైన్...

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ..

మన భారత్, మొగుళ్లపల్లి: మొగుళ్లపల్లి మండలంలోని పాత ఇస్సిపేట గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు, అరటి పండ్లు...

తులం బంగారం ఎప్పుడు ఇస్తారో..?

మన భారత్, తలమడుగు: కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలతో గద్దెనిక్కిందని కళ్యాణ లక్ష్మితో తులం బంగారం ఎప్పుడు ఇస్తారని ఆడపడుచులు...

More like this

విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై ఆగ్రహం..

మన భారత్, ఆదిలాబాద్:  విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిన పాటిల్ అనీల్ ఘటనపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి....

విద్యుత్ షాక్‌తో అసిస్టెంట్ లైన్ మెన్ మృతి

మన భారత్, భీంపూర్: భీంపూర్ మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ మరమ్మతుల పనులు నిర్వహిస్తున్న సమయంలో అసిస్టెంట్ లైన్...

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ..

మన భారత్, మొగుళ్లపల్లి: మొగుళ్లపల్లి మండలంలోని పాత ఇస్సిపేట గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు, అరటి పండ్లు...