మన భారత్,మొగుళ్ళపల్లి:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని ఇస్సిపేట గ్రామపంచాయతీ ,మొగుళ్ళపల్లి రైతు వేదికలో వ్యవసాయ అధికారి సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ పద్ధతి వ్యవసాయ పథకం, ఆత్మ పథకంలో భాగంగా అవగాహన సదస్సు శనివారం నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి సురేందర్ రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాంత్ మాళవిక అధికారి మాట్లాడుతూ,సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులతో నేలలోని సూక్ష్మజీవులు, సేంద్రీయ కర్బనం, జీవవైవిద్యాన్ని, పునర్ధరించడం పంటల దిగుబడి పెరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎమ్ ఎన్ ఎఫ్ ప్రతినిది కమలాకర్, మణికర్, రైతులు, పాల్గొన్నారు.
మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి
జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి
