గణపతి ఉత్సవాల నిర్వహణపై సమన్వయ సమావేశం..

Published on

-Advertisement-

సెప్టెంబర్ 1న తానిషా గార్డెన్‌లో జిల్లా స్థాయి సమావేశం

మండపాల నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు హాజరు కావాలి: డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి

ఆదిలాబాద్, ఆగస్టు 30: ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతమైన వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గణపతి ఉత్సవ కమిటీ సభ్యులతో సమన్వయ సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి వివరాలు వెల్లడించారు.

సెప్టెంబర్ 1వ తేదీ మంగళవారం ఉదయం 10:30 గంటలకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తానిషా గార్డెన్‌లో ఈ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐపీఎస్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.

జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాల్లో ఏర్పాటు చేసే గణపతి మండపాల నిర్వాహకులు, ఉత్సవ కమిటీ అధ్యక్షులు, సభ్యులు, హిందూ సంఘాల నాయకులు, స్థానిక కౌన్సిలర్లు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాలని డీఎస్పీ కోరారు.

భద్రతా చర్యలపై అవగాహన

గణపతి ఉత్సవాల సందర్భంగా మండపాల ఏర్పాటు, గణపతి విగ్రహాల ఊరేగింపులు, నిమజ్జన కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ నియంత్రణ, విద్యుత్ భద్రత, డీజేలు మరియు అధిక శబ్దం నియంత్రణ, మహిళలు–చిన్నారుల భద్రత, అగ్నిప్రమాదాల నివారణ వంటి అంశాలపై నిర్వాహకులకు పోలీస్ శాఖ అధికారులు అవగాహన కల్పించనున్నారు.

పోలీస్ శాఖకు సహకరించాలి

గణపతి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో పాటు సామాజిక బాధ్యతతో నిర్వహించాలని డీఎస్పీ సూచించారు. ఉత్సవాల సందర్భంగా శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా నిర్వాహకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

జిల్లాలో గణపతి ఉత్సవాలు ప్రశాంతంగా, విజయవంతంగా జరిగేలా ఉత్సవ కమిటీ సభ్యులు, యువత, ప్రజాప్రతినిధులు పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన సందేహాలు, సమస్యలు ఉంటే సమన్వయ సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా ఉన్న గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు, మండపాల నిర్వాహకులు, హిందూ సంఘాల నాయకులు, కౌన్సిలర్లు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు సెప్టెంబర్ 1న జరిగే సమావేశానికి పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి 

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

గిరిజనుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే

వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజల హక్కులకు ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల జీవనోపాధి, అభివృద్ధి అవసరం: ఎమ్మెల్యే...

ఒకే బస్సుతో ప్రయాణికులకు పరేషాన్.!

తలమడగు–కోసాయి మార్గంలో అదనపు బస్సులు నడపాలని ప్రయాణికుల డిమాండ్ తలమడుగు, ఆగస్టు 31: తలమడుగు మండల కేంద్రం నుంచి కోసాయి...

కొత్త పెన్షన్ల దరఖాస్తు గడువు పొడిగింపు..

సెప్టెంబర్ 15 వరకు అవకాశం.. ఇప్పటికే 4.50 లక్షల దరఖాస్తులు మరొక అవకాశం కల్పించాలని వచ్చిన విజ్ఞప్తులతో ప్రభుత్వం నిర్ణయం హైదరాబాద్:...

ప్రజా ఫిర్యాదులపై తక్షణమే స్పందించి పరిష్కరించాలి..

గ్రీవెన్స్ డేలో 23 ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సంబంధిత అధికారులకు ఫోన్ చేసి త్వరితగతిన పరిష్కరించాలని...

More like this

గిరిజనుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే

వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజల హక్కులకు ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల జీవనోపాధి, అభివృద్ధి అవసరం: ఎమ్మెల్యే...

ఒకే బస్సుతో ప్రయాణికులకు పరేషాన్.!

తలమడగు–కోసాయి మార్గంలో అదనపు బస్సులు నడపాలని ప్రయాణికుల డిమాండ్ తలమడుగు, ఆగస్టు 31: తలమడుగు మండల కేంద్రం నుంచి కోసాయి...

కొత్త పెన్షన్ల దరఖాస్తు గడువు పొడిగింపు..

సెప్టెంబర్ 15 వరకు అవకాశం.. ఇప్పటికే 4.50 లక్షల దరఖాస్తులు మరొక అవకాశం కల్పించాలని వచ్చిన విజ్ఞప్తులతో ప్రభుత్వం నిర్ణయం హైదరాబాద్:...