ఉచిత కంటి వైద్య శిబిరం..

Published on

-Advertisement-

శ్రీ సాయి ఐ కేర్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

తలమడుగు, ఆగస్టు 30: తలమడుగు మండల కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో శ్రీ సాయి ఐ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కంటి సమస్యలతో బాధపడుతున్న పలువురు గ్రామస్తులు శిబిరానికి హాజరై కంటి పరీక్షలు చేయించుకున్నారు.

ఈ సందర్భంగా వైద్యుడు డా. వల్లేవాడ్ రాహుల్ మాట్లాడుతూ కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో వైద్యులను సంప్రదించాలని సూచించారు. శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి ఉచిత మందులు, టాబ్లెట్లు అందిస్తున్నట్లు తెలిపారు. కంటి ఆపరేషన్ అవసరమైన రోగులకు వైద్యుల సూచనల మేరకు ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించే అవకాశం కల్పిస్తామని వివరించారు.

అలాగే కంటి చూపు సమస్యలున్న వారికి అవసరమైన కళ్లద్దాలను సగం ధరకే అందించడంతో పాటు హోమ్ డెలివరీ సౌకర్యం కూడా కల్పిస్తామని డా. రాహుల్ తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు కంటి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే శిబిరం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.

కంటి పరీక్షలు చేయించుకున్న గ్రామస్తులు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా వృద్ధులు, కంటి చూపు సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ శిబిరం ఎంతో ఉపయోగకరంగా నిలిచింది.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఏలుగు రాజన్న (చంటి), శ్రీ సాయి ఐ కేర్ హాస్పిటల్ వైద్య సిబ్బంది, గ్రామస్తులు, కంటి చూపు సమస్యలతో బాధపడుతున్న వారు తదితరులు పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి 

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

గిరిజనుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే

వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజల హక్కులకు ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల జీవనోపాధి, అభివృద్ధి అవసరం: ఎమ్మెల్యే...

ఒకే బస్సుతో ప్రయాణికులకు పరేషాన్.!

తలమడగు–కోసాయి మార్గంలో అదనపు బస్సులు నడపాలని ప్రయాణికుల డిమాండ్ తలమడుగు, ఆగస్టు 31: తలమడుగు మండల కేంద్రం నుంచి కోసాయి...

కొత్త పెన్షన్ల దరఖాస్తు గడువు పొడిగింపు..

సెప్టెంబర్ 15 వరకు అవకాశం.. ఇప్పటికే 4.50 లక్షల దరఖాస్తులు మరొక అవకాశం కల్పించాలని వచ్చిన విజ్ఞప్తులతో ప్రభుత్వం నిర్ణయం హైదరాబాద్:...

ప్రజా ఫిర్యాదులపై తక్షణమే స్పందించి పరిష్కరించాలి..

గ్రీవెన్స్ డేలో 23 ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సంబంధిత అధికారులకు ఫోన్ చేసి త్వరితగతిన పరిష్కరించాలని...

More like this

గిరిజనుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే

వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజల హక్కులకు ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల జీవనోపాధి, అభివృద్ధి అవసరం: ఎమ్మెల్యే...

ఒకే బస్సుతో ప్రయాణికులకు పరేషాన్.!

తలమడగు–కోసాయి మార్గంలో అదనపు బస్సులు నడపాలని ప్రయాణికుల డిమాండ్ తలమడుగు, ఆగస్టు 31: తలమడుగు మండల కేంద్రం నుంచి కోసాయి...

కొత్త పెన్షన్ల దరఖాస్తు గడువు పొడిగింపు..

సెప్టెంబర్ 15 వరకు అవకాశం.. ఇప్పటికే 4.50 లక్షల దరఖాస్తులు మరొక అవకాశం కల్పించాలని వచ్చిన విజ్ఞప్తులతో ప్రభుత్వం నిర్ణయం హైదరాబాద్:...