అంతర్జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు
మన భారత్,మొగుళ్ళపల్లి:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా TRP మొగుళ్లపల్లి మండల అధ్యక్షులు బోనగిరి రాజేష్ అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా యువతీ యువకులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.యువతకు నాణ్యమైన విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, క్రీడా సదుపాయాలు, స్వయం ఉపాధికి ఆర్థిక సహాయం, నాయకత్వ అవకాశాలను ప్రభుత్వం మరింత విస్తృతంగా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.యువత భవిష్యత్తును బలోపేతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, ఇచ్చిన హామీలను ఆచరణలోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు.యువత స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగుతూ, వ్యసనాలకు దూరంగా ఉండి సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని బోనగిరి రాజేష్ పిలుపునిచ్చారు.యువత సాధికారతే సమాజ అభివృద్ధికి బలమైన పునాది. యువతకు మెరుగైన అవకాశాలు కల్పిస్తేనే దేశ భవిష్యత్తు మరింత బలోపేతం అవుతుంది” అని బోనగిరి రాజేష్ అన్నారు.
మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి
జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
