తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ మొగుళ్ళపల్లి మండల అధ్యక్షుడిగా చదువు అన్నారెడ్డి
మన భారత్, మొగుళ్ళపల్లి:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ మండల అధ్యక్షుడిగా ముల్కలపల్లి గ్రామానికి చెందిన సర్పంచుల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు..బీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు..మలిదశ తెలంగాణ ఉద్యమానికి మండలంలో ఊపిరి పోసిన చదువు అన్నారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనారు. బుధవారం మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని శ్రీ సాయి లక్ష్మి గార్డెన్ లో జరిగిన తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సమావేశంలో తెలంగాణ ఉద్యమకారులంతా చదువు అన్నారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని, ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు పున్నం రవి ప్రకటించారు.సందర్భంగా నూతనంగా నియమితులైన చదువు అన్నారెడ్డి మాట్లాడారు. తనపై నమ్మకంతో ఈ బృహత్తరమైన బాధ్యతలను అప్పగించిన తెలంగాణ ఉద్యమకారుల హక్కులను కాపాడేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన తెలంగాణ ఉద్యమకారులు పాల్గొన్నారు.
జిల్లాలో పని చేయుటకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలు మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి ..
