పేద విద్యార్థుల చదువుల కంటే మూసీ ముఖ్యమా.?

Published on

-Advertisement-

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వేముల మహేందర్ గౌడ్ సూటి ప్రశ్న?

మన భారత్ మొగుళ్ళపల్లి:

రాష్ట్రంలోని 14 లక్షల మంది పేద విద్యార్థుల చదువుల కంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మూసీ సుందరీకరణే ముఖ్యమా? అని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ ప్రశ్నించారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత నాలుగేళ్లుగా రూ.7,000 కోట్ల ఫీజుల బకాయిలను ప్రభుత్వం చెల్లించడం లేదని ఆరోపించారు. పేద విద్యార్థుల ఫీజులకు రూపాయి ఇవ్వని ప్రభుత్వం.. మూసీ సుందరీకరణ మొదటి దశ కోసం రూ.7,345 కోట్లు ఎలా విడుదల చేసిందన్నారు. ఫీజులు రాక కాలేజీ యజమాన్యాలు హాల్ టికెట్లు, సర్టిఫికెట్లు ఆపేస్తుండడంతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. బకాయిలను వెంటనే విడుదల చేసేలా ప్రభుత్వంపై బీసీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికార పార్టీ బీసీ నాయకులు ఒత్తిడి తేవాలని మహేందర్ గౌడ్ డిమాండ్ చేశారు.

Latest articles

అనుమతులు లేకుండా కల్తీ కల్లు విక్రయం.. 

ఒకరికి రూ.50 వేలు.. మరొకరికి రూ.10 వేల జరిమానా బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్న తలమడుగు ఎస్‌ఐ...

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్‌దే అధికారం: కృష్ణ రత్న ప్రకాష్

కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి.. బీఆర్ఎస్‌కు మద్దతు పెరుగుతోంది తాంసి నుంచి బోథ్ ధర్నాకు భారీగా తరలివెళ్లిన బీఆర్ఎస్...

19 రాష్ట్రాల్లో 140 మంది బాధితులు.. రూ.5.30 కోట్లకు పైగా కొల్లగొట్టిన అంతర్రాష్ట్ర నేరగాడు అరెస్ట్

ఇన్‌స్టాగ్రామ్‌లో మొబైల్ స్పేర్ పార్ట్స్ పేరుతో భారీ సైబర్ మోసం 19 రాష్ట్రాల్లో 140 మంది బాధితులు.. రూ.5.30 కోట్లకు...

ఆ నలుగురు అరెస్ట్.!

గుప్త నిధుల పేరుతో మోసానికి యత్నం.. నలుగురు అరెస్ట్ ఉట్నూర్ కోటలో తవ్వకాలకు ప్రయత్నం.. వీడియోలతో ప్రజలను నమ్మించే యత్నం 4...

More like this

అనుమతులు లేకుండా కల్తీ కల్లు విక్రయం.. 

ఒకరికి రూ.50 వేలు.. మరొకరికి రూ.10 వేల జరిమానా బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్న తలమడుగు ఎస్‌ఐ...

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్‌దే అధికారం: కృష్ణ రత్న ప్రకాష్

కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి.. బీఆర్ఎస్‌కు మద్దతు పెరుగుతోంది తాంసి నుంచి బోథ్ ధర్నాకు భారీగా తరలివెళ్లిన బీఆర్ఎస్...

19 రాష్ట్రాల్లో 140 మంది బాధితులు.. రూ.5.30 కోట్లకు పైగా కొల్లగొట్టిన అంతర్రాష్ట్ర నేరగాడు అరెస్ట్

ఇన్‌స్టాగ్రామ్‌లో మొబైల్ స్పేర్ పార్ట్స్ పేరుతో భారీ సైబర్ మోసం 19 రాష్ట్రాల్లో 140 మంది బాధితులు.. రూ.5.30 కోట్లకు...