పాఠశాలలో కంప్లైంట్ బాక్స్ తప్పనిసరి..

Published on

-Advertisement-

మన భారత్ | ఆదిలాబాద్

ప్రతి పాఠశాలలో కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేయాలి.. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కలెక్టర్ రాజర్షి షా ఆదేశాలు

ఆదిలాబాద్, జూలై 7 (మన భారత్): జిల్లాలోని ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థుల కోసం కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేయాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు పాఠశాలలో ఎదురయ్యే సమస్యలను నిర్భయంగా తెలియజేసేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.

విద్యార్థులు చదువుకు సంబంధించిన సమస్యలు, పాఠశాల వాతావరణం, మౌలిక వసతులు లేదా ఇతర ఇబ్బందులపై తమ అభిప్రాయాలు, ఫిర్యాదులను గోప్యంగా కంప్లైంట్ బాక్స్‌లో వేయవచ్చని విద్యార్థులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు.

కంప్లైంట్ బాక్స్ తాళం చెవి (కీ) సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడి వద్ద ఉండాలని, ప్రతి నెల ఒకసారి బాక్స్‌ను తెరిచి అందులో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమస్యల స్వభావాన్ని బట్టి సంబంధిత అధికారులకు సమాచారం అందించి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

పాఠశాలలను తనిఖీ చేసే అధికారులు తమ పర్యటనల సందర్భంగా కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేశారా లేదా అనే అంశాన్ని తప్పనిసరిగా పరిశీలించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అలాగే బాక్స్ ఏర్పాటు చేయడమే కాకుండా, దాని వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పించడం కూడా పాఠశాల యాజమాన్యాల బాధ్యత అని పేర్కొన్నారు.

విద్యార్థులు తమ సమస్యలను స్వేచ్ఛగా వ్యక్తం చేసే వాతావరణం కల్పించడం ద్వారా పాఠశాలల్లో పారదర్శకత, భద్రత, విద్యార్థి సంక్షేమం మరింత మెరుగుపడుతుందని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు.

గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్ 

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి: ఎస్పీ

మన భారత్, ఆదిలాబాద్ గంజాయి, మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ రీజోనెన్స్ పాఠశాలలో...

పోలీసుల ఆరోగ్యమే ప్రజల భద్రతకు బలం..

మన భారత్, ఆదిలాబాద్ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ యశోద హాస్పిటల్స్ సహకారంతో...

నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తప్పవు..

మన భారత్, ఆదిలాబాద్ ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిన విద్యార్థుల హాజరు.. 9 మంది ఎంఈవోలకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు సిరికొండ, గుడిహత్నూర్...

అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలి: కలెక్టర్

మన భారత్, ఆదిలాబాద్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదిలాబాద్, జూలై 18: జిల్లాలో...

More like this

చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి: ఎస్పీ

మన భారత్, ఆదిలాబాద్ గంజాయి, మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ రీజోనెన్స్ పాఠశాలలో...

పోలీసుల ఆరోగ్యమే ప్రజల భద్రతకు బలం..

మన భారత్, ఆదిలాబాద్ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ యశోద హాస్పిటల్స్ సహకారంతో...

నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తప్పవు..

మన భారత్, ఆదిలాబాద్ ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిన విద్యార్థుల హాజరు.. 9 మంది ఎంఈవోలకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు సిరికొండ, గుడిహత్నూర్...