డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్

Published on

-Advertisement-

డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ 

బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో ఘన నివాళులు

మన భారత్, తలమడుగు:

తలమడుగు మండలం దేవాపూర్ గ్రామంలో భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి సందర్భంగా బలిదాన్ దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా బీజేపీ యువమోర్చా మండల అధ్యక్షులు దాతాజీ కిరణ్ గారు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. “ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే జెండా” అనే లక్ష్యంతో దేశ సమగ్రత కోసం పోరాడి కాశ్మీర్ కోసం తన ప్రాణాలను అర్పించిన మహనీయుడు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ అని అన్నారు. ఆయన ఆశయాలు, దేశభక్తి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

దేశ ఐక్యత, సమగ్రత కోసం ముఖర్జీ చేసిన సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు శానం శ్రీనివాస్, అడెపు శ్రీనివాస్, పిట్ల శేఖర్, రేగుల మోహన్, పోరండ్ల రాములు, విష్ణు, ఓస రవి, గంగాధర్, గంధం నరేష్, సంతోష్, రాజు, రామన్న, పొచ్చన్న, లింగం తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొని డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారి త్యాగాలను స్మరించుకున్నారు.

Latest articles

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

గిరిజనుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే

వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజల హక్కులకు ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల జీవనోపాధి, అభివృద్ధి అవసరం: ఎమ్మెల్యే...

ఒకే బస్సుతో ప్రయాణికులకు పరేషాన్.!

తలమడగు–కోసాయి మార్గంలో అదనపు బస్సులు నడపాలని ప్రయాణికుల డిమాండ్ తలమడుగు, ఆగస్టు 31: తలమడుగు మండల కేంద్రం నుంచి కోసాయి...

కొత్త పెన్షన్ల దరఖాస్తు గడువు పొడిగింపు..

సెప్టెంబర్ 15 వరకు అవకాశం.. ఇప్పటికే 4.50 లక్షల దరఖాస్తులు మరొక అవకాశం కల్పించాలని వచ్చిన విజ్ఞప్తులతో ప్రభుత్వం నిర్ణయం హైదరాబాద్:...

More like this

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

గిరిజనుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే

వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజల హక్కులకు ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల జీవనోపాధి, అభివృద్ధి అవసరం: ఎమ్మెల్యే...

ఒకే బస్సుతో ప్రయాణికులకు పరేషాన్.!

తలమడగు–కోసాయి మార్గంలో అదనపు బస్సులు నడపాలని ప్రయాణికుల డిమాండ్ తలమడుగు, ఆగస్టు 31: తలమడుగు మండల కేంద్రం నుంచి కోసాయి...