దళిత మహిళలపై దాడులు సరైనది కాదు..

Published on

-Advertisement-

మన భారత్, విజయనగరం:
విజయనగరం జిల్లా జామి, కొత్తవలసతో పాటు పలు మండలాల్లో దళిత మహిళలపై దాడులు పెరుగుతున్నాయని అఖిలభారత మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు కొత్తలి గౌరీ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. దళితులపై జరుగుతున్న అన్యాయాలను అరికట్టడంలో అధికారులు విఫలమవుతున్నారని విమర్శించారు.

ప్రజలకు న్యాయం చేయాల్సిన అధికారులే పెత్తందారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ దళితులకు అన్యాయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లో దళిత మహిళలు భయభ్రాంతులకు గురవుతున్నారని, పలుచోట్ల వేధింపులు, దాడులు జరిగినప్పటికీ సరైన చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు.

దళితులపై దాడులు జరుగుతున్న సందర్భాల్లో పోలీసులు కేసులు నమోదు చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆయన మండిపడ్డారు. బాధితులు పోలీస్ స్టేషన్లకు వెళ్లినా సరైన స్పందన లభించడం లేదని, దీంతో దళిత కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయని తెలిపారు.

ఈ అంశంపై ఇప్పటికే National Commission for Scheduled Castes మరియు National Commission for Scheduled Tribes కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దళితులపై జరుగుతున్న దాడులపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

సమాజంలో బలహీన వర్గాల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, దళిత మహిళలకు రక్షణ కల్పించే విధంగా అధికారులు పని చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

దళితుల హక్కులను పరిరక్షించడంలో ప్రభుత్వం, పోలీసులు మరింత బాధ్యతగా వ్యవహరించాలని ప్రజాసంఘాలు కోరుతున్నాయి.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

2027 నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ పూర్తి: మంత్రి

2027 నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ పూర్తి.. శాస్త్రీయ డిజైన్లతో పనులు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మన భారత్,...

ఆ చెత్తను వెంటనే తొలగించాలి..

అంబేద్కర్ చౌక్–కిసాన్ చౌక్ డివైడర్లపై పేరుకుపోయిన చెత్త.. వెంటనే తొలగించాలని సామాజిక కార్యకర్త ప్రేమకళ మన భారత్, ఆదిలాబాద్ ఆదిలాబాద్ జిల్లా...

బ్రహ్మా ముహూర్తం.. మీకు తెలుసా 

బ్రహ్మా ముహూర్తం.. మీకు తెలుసా  మన భారత్, ఇంటర్నెట్ డెస్క్:  ఈ పదాన్ని మనం చిన్నప్పటి నుంచి వినే ఉంటాం. కానీ.....

ప్లాస్టిక్ రహిత శిక్షణకు శ్రీకారం..

స్టీల్ ప్లేట్లు, గ్లాసులతో ఆదర్శంగా నిలిచిన ఉపాధ్యాయులు మన భారత్, నారాయణపేట, జూలై 20: పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయులు...

More like this

2027 నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ పూర్తి: మంత్రి

2027 నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ పూర్తి.. శాస్త్రీయ డిజైన్లతో పనులు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మన భారత్,...

ఆ చెత్తను వెంటనే తొలగించాలి..

అంబేద్కర్ చౌక్–కిసాన్ చౌక్ డివైడర్లపై పేరుకుపోయిన చెత్త.. వెంటనే తొలగించాలని సామాజిక కార్యకర్త ప్రేమకళ మన భారత్, ఆదిలాబాద్ ఆదిలాబాద్ జిల్లా...

బ్రహ్మా ముహూర్తం.. మీకు తెలుసా 

బ్రహ్మా ముహూర్తం.. మీకు తెలుసా  మన భారత్, ఇంటర్నెట్ డెస్క్:  ఈ పదాన్ని మనం చిన్నప్పటి నుంచి వినే ఉంటాం. కానీ.....