అక్రమ విత్తనాలపై అప్రమత్తంగా ఉండాలి

Published on

-Advertisement-

మన భారత్, ఆదిలాబాద్:
రాత్రి వేళల్లో గ్రామాల్లోకి వచ్చి లూజ్ విత్తనాలు విక్రయించే వ్యక్తులపై రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. అనుమానాస్పదంగా విక్రయించే విత్తనాలను కొనుగోలు చేసి మోసపోవద్దని, ఎవరైనా అక్రమ విక్రయాలకు పాల్పడితే వెంటనే వ్యవసాయ శాఖ లేదా పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని కోరారు.

ప్రత్యేకంగా నిషేధిత బీటీ-3 విత్తనాలు మరియు 3 గ్లైఫోసేట్ వంటి గడ్డి మందుల వినియోగం, విక్రయం చట్టరీత్యా నేరమని కలెక్టర్ స్పష్టం చేశారు. రైతులు సరైన ధృవీకరణ కలిగిన దుకాణాల నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలని, లైసెన్స్ లేని వ్యక్తుల వద్ద కొనుగోలు చేయడం వల్ల నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

రైతుల రక్షణ కోసం వ్యవసాయ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏవైనా సందేహాలు, ఇబ్బందులు ఎదురైన సందర్భంలో జిల్లా వ్యవసాయ అధికారి (DAO) కంట్రోల్ రూమ్ నంబర్ 89777428542 ను సంప్రదించాలని సూచించారు.

రైతులు జాగ్రత్తగా ఉండి, అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే ఫిర్యాదు చేయడం ద్వారా తమను తాము రక్షించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.


మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

‘పెద్ది’కి పాజిటివ్ పబ్లిక్ టాక్.!

మన భారత్ | సినిమా డెస్క్ 'రామ్ చరణ్ నటనపై ప్రశంసల వర్షం బాడీ లాంగ్వేజ్, ఎమోషనల్ సన్నివేశాల్లో రామ్ చరణ్...

అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: ఎస్పీ

మన భారత్, ఆదిలాబాద్ ఇందిరమ్మ కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం – 37 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలు, 54...

శ్రీనిధి పుట్టినరోజు పర్యావరణానికి అంకితం

మన భారత్, తాంసి జామిడి గ్రామంలో రెండు పండ్ల మొక్కలు నాటిన మలపతి ప్రకాష్ కుటుంబం పచ్చదనం పెంపొందించడంలో ప్రతి ఒక్కరూ...

భద్రత పథకం చెక్కు పంపిణీ చేసిన ఎస్పీ

మన భారత్ | ఆదిలాబాద్ జిల్లా విధి నిర్వహణలో మృతి చెందిన కానిస్టేబుల్ కుటుంబానికి రూ.8 లక్షల ఆర్థిక సాయం భద్రత...

More like this

‘పెద్ది’కి పాజిటివ్ పబ్లిక్ టాక్.!

మన భారత్ | సినిమా డెస్క్ 'రామ్ చరణ్ నటనపై ప్రశంసల వర్షం బాడీ లాంగ్వేజ్, ఎమోషనల్ సన్నివేశాల్లో రామ్ చరణ్...

అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: ఎస్పీ

మన భారత్, ఆదిలాబాద్ ఇందిరమ్మ కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం – 37 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలు, 54...

శ్రీనిధి పుట్టినరోజు పర్యావరణానికి అంకితం

మన భారత్, తాంసి జామిడి గ్రామంలో రెండు పండ్ల మొక్కలు నాటిన మలపతి ప్రకాష్ కుటుంబం పచ్చదనం పెంపొందించడంలో ప్రతి ఒక్కరూ...