జియో యూజర్లకు మరో షాక్..!

Published on

-Advertisement-

మన భారత్, న్యూఢిల్లీ: 

టెలికాం రంగంలో కీలక సంస్థ అయిన రిలయన్స్ జియో తమ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. చౌకైన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌గా గుర్తింపు పొందిన రూ.209 ప్లాన్‌ను పూర్తిగా తొలగించింది. గత ఏడాదిలోనే ఈ ప్లాన్‌ను అధికారికంగా నిలిపివేసినప్పటికీ, “మై జియో” యాప్‌లో కొంతమేర అందుబాటులో ఉండేది. అయితే ఇప్పుడు ఆ ప్లాట్‌ఫామ్ నుంచి కూడా పూర్తిగా తొలగించడం గమనార్హం.

ఈ నిర్ణయం వల్ల తక్కువ ఖర్చుతో డేటా మరియు కాలింగ్ సేవలు పొందుతున్న యూజర్లపై అదనపు భారం పడే అవకాశం ఉందని టెలికాం విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా బడ్జెట్ ప్లాన్లపై ఆధారపడే వినియోగదారులు ఈ మార్పుతో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది.

గతంలో రూ.209 ప్లాన్ కింద జియో వినియోగదారులకు 22 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1GB డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు అందించేది. ఈ ప్లాన్ తక్కువ ధరలో సరసమైన ప్రయోజనాలను అందించడంతో విస్తృతంగా వినియోగంలో ఉండేది.

జియో తాజా నిర్ణయంతో వినియోగదారులు ఇప్పుడు అధిక ధరల ప్లాన్ల వైపు మళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. టెలికాం మార్కెట్లో పోటీ పెరుగుతున్న నేపథ్యంలో కంపెనీలు తమ వ్యూహాలను మారుస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు ఫోన్ వినియోగించే కస్టమర్లు తమకు ఇన్కమింగ్ ఫ్రీగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించి బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ లో ఉచితంగా ఇన్కమింగ్ ఇవ్వాలని అంటున్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

విద్యా కమిషన్ ప్రతిపాదనలపై టీఆర్ఎస్ ఆందోళన..

ప్రభుత్వ పాఠశాలల విలీనాన్ని వ్యతిరేకిస్తున్నాం.. విద్యా కమిషన్ ప్రతిపాదనలపై తెలంగాణ రక్షణ సేన ఆందోళన మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో...

రైతులు ప్రజల రక్షణే ప్రభుత్వ లక్ష్యం..

మన భారత్, ఆదిలాబాద్  వర్షాభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి: ప్రత్యేక అధికారి ఇల్లంబర్తి ఆదిలాబాద్, జూలై 21: రైతుల సంక్షేమం,...

నీటి సంరక్షణే భవిష్యత్‌కు భరోసా..

మన భారత్, ఆదిలాబాద్ నీటి సంరక్షణే భవిష్యత్‌కు భరోసా.. భూగర్భ జలాల పెంపుపై దృష్టి పెట్టాలి: కలెక్టర్ రాజర్షి షా ఆదిలాబాద్,...

రైతులకు నీళ్లు ఇవ్వని కాంగ్రెస్ సర్కార్: కల్వకుంట్ల కవిత

రైతులకు నీళ్లు ఇవ్వకుండా రాజకీయాలు చేస్తున్న ప్రభుత్వం: టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత ఆరోపణ మన భారత్, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజ్‌తో...

More like this

విద్యా కమిషన్ ప్రతిపాదనలపై టీఆర్ఎస్ ఆందోళన..

ప్రభుత్వ పాఠశాలల విలీనాన్ని వ్యతిరేకిస్తున్నాం.. విద్యా కమిషన్ ప్రతిపాదనలపై తెలంగాణ రక్షణ సేన ఆందోళన మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో...

రైతులు ప్రజల రక్షణే ప్రభుత్వ లక్ష్యం..

మన భారత్, ఆదిలాబాద్  వర్షాభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి: ప్రత్యేక అధికారి ఇల్లంబర్తి ఆదిలాబాద్, జూలై 21: రైతుల సంక్షేమం,...

నీటి సంరక్షణే భవిష్యత్‌కు భరోసా..

మన భారత్, ఆదిలాబాద్ నీటి సంరక్షణే భవిష్యత్‌కు భరోసా.. భూగర్భ జలాల పెంపుపై దృష్టి పెట్టాలి: కలెక్టర్ రాజర్షి షా ఆదిలాబాద్,...