నష్ట పరిహారం అందేలా చూస్తా: ఎమ్మెల్యే GSR

Published on

-Advertisement-

మన భారత్, మొగుళ్ళపల్లి :

మొగుళ్ళపల్లి మండలంలోని ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో దగ్ధమైన మొక్కజొన్న పంటలను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు (జిఎస్సార్) పరిశీలించారు. శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనలో కూసు కొమురయ్య, గోనె శ్రీనివాస్, మొర్రి ఐలయ్య, పిండి దేవేందర్, నల్ల బుచ్చి రెడ్డి, నల్ల రాములు తదితర రైతులకు చెందిన సుమారు 12 ఎకరాల మొక్కజొన్న పంట పూర్తిగా కాలిపోయింది.

సమాచారం అందుకున్న వెంటనే ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హుటాహుటిన గ్రామానికి చేరుకుని, నష్టపోయిన పంట చేలను ప్రత్యక్షంగా పరిశీలించారు. రైతులతో మాట్లాడి ఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పంట నష్టం వల్ల ఎదురైన ఇబ్బందులను రైతులు వివరించగా, వారికి ధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వం ద్వారా నష్టపోయిన రైతులకు సహాయ సహకారాలు అందేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వేసవి కాలంలో అగ్ని ప్రమాదాల ప్రమాదం ఎక్కువగా ఉండే కారణంగా రైతులు తమ పంటల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఈ పరిశీలనలో ఎమ్మార్వో, ఎంపీడీవో, వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్టపరిహారం అందించాలని రైతులు విజ్ఞప్తి చేశారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

శ్రీ మురళీకృష్ణ ఆలయంలో క్విజ్ పోటీలు..

మన భారత్, ఆదిలాబాద్:  ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని పొన్నారి గ్రామంలో శ్రీ మురళీకృష్ణాలయం 8వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని భక్తులకు...

కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్యత అవసరం

మన భారత్, ధన్వాడ:  మండల కేంద్రమైన ధన్వాడలో శుక్రవారం అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మేడే) వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రధాన...

దివ్యాంగురాలి కుటుంబానికి అండగా సర్పంచ్

మన భారత్, మొగుళ్ళపల్లి: సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న మొగుళ్ళపల్లి గ్రామ సర్పంచ్ చాట్ల విజయ–రవీందర్ దంపతులు మానవత్వానికి ప్రతీకగా...

నిధులు మంజూరు.. నిలిచిపోయిన రోడ్లు పనులు.!

మన భారత్, తలమడుగు: తలమడుగు మండలంలోని కప్పర్దేవి గ్రామంలో సీసీ రోడ్లు, నాలాల నిర్మాణానికి నిధులు మంజూరైనప్పటికీ ఇప్పటివరకు పనులు...

More like this

శ్రీ మురళీకృష్ణ ఆలయంలో క్విజ్ పోటీలు..

మన భారత్, ఆదిలాబాద్:  ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని పొన్నారి గ్రామంలో శ్రీ మురళీకృష్ణాలయం 8వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని భక్తులకు...

కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్యత అవసరం

మన భారత్, ధన్వాడ:  మండల కేంద్రమైన ధన్వాడలో శుక్రవారం అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మేడే) వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రధాన...

దివ్యాంగురాలి కుటుంబానికి అండగా సర్పంచ్

మన భారత్, మొగుళ్ళపల్లి: సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న మొగుళ్ళపల్లి గ్రామ సర్పంచ్ చాట్ల విజయ–రవీందర్ దంపతులు మానవత్వానికి ప్రతీకగా...