మన భారత్, మొగుళ్ళపల్లి :
మొగుళ్ళపల్లి మండలంలోని ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో దగ్ధమైన మొక్కజొన్న పంటలను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు (జిఎస్సార్) పరిశీలించారు. శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనలో కూసు కొమురయ్య, గోనె శ్రీనివాస్, మొర్రి ఐలయ్య, పిండి దేవేందర్, నల్ల బుచ్చి రెడ్డి, నల్ల రాములు తదితర రైతులకు చెందిన సుమారు 12 ఎకరాల మొక్కజొన్న పంట పూర్తిగా కాలిపోయింది.
సమాచారం అందుకున్న వెంటనే ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హుటాహుటిన గ్రామానికి చేరుకుని, నష్టపోయిన పంట చేలను ప్రత్యక్షంగా పరిశీలించారు. రైతులతో మాట్లాడి ఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పంట నష్టం వల్ల ఎదురైన ఇబ్బందులను రైతులు వివరించగా, వారికి ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వం ద్వారా నష్టపోయిన రైతులకు సహాయ సహకారాలు అందేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వేసవి కాలంలో అగ్ని ప్రమాదాల ప్రమాదం ఎక్కువగా ఉండే కారణంగా రైతులు తమ పంటల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ పరిశీలనలో ఎమ్మార్వో, ఎంపీడీవో, వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్టపరిహారం అందించాలని రైతులు విజ్ఞప్తి చేశారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
