బీపీ మాత్రలు మింగి బాలిక ఆత్మహత్యాయత్నం..
మన భారత్ , జైనథ్: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో ఓ బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. తండ్రి మందలించాడనే మనస్తాపంతో 17 ఏళ్ల బాలిక అధిక మోతాదులో బీపీ మాత్రలు మింగి తీవ్ర అస్వస్థతకు గురైంది. స్థానికుల వివరాల ప్రకారం, ఆదివారం మండలంలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాలిక ఒక్కసారిగా స్పృహ కోల్పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. పరిస్థితి విషమంగా మారుతుండటంతో వెంటనే 108 అంబులెన్స్కు సమాచారం అందించారు....