శంకరన్న కుటుంబానికి అండగా ఉంటాం: సీఎం

Published on

-Advertisement-

మన భారత్ ,హైదరాబాద్:
ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్ గౌడ్ బలవన్మరణం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించిన ఆయన, శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయి సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

శంకర్ గౌడ్ ఆకస్మిక మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు ఈ క్లిష్ట సమయంలో ధైర్యం, మనోబలం కలగాలని ఆకాంక్షించారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఒక కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచిందని పేర్కొంటూ, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదన్నారు.

ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందని సీఎం తెలిపారు. కార్మిక సంఘాలతో చర్చలు జరిపి సమస్యలకు పరిష్కారం కనుగొనేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పారు. కార్మికుల ఆందోళనలను గౌరవిస్తూ, వారి న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం స్పందిస్తుందని హామీ ఇచ్చారు.

ఈ ఘటన నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు భావోద్వేగాలకు లోనవకుండా సంయమనం పాటించాలని, సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో శాంతి, స్థిరత్వం కొనసాగేందుకు అందరూ సహకరించాలని కోరారు.

శంకర్ గౌడ్ మృతితో కార్మిక వర్గంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రభుత్వం తీసుకునే చర్యలు, చర్చల ఫలితాలపై అందరి దృష్టి నిలిచింది.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్

డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్  బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో ఘన నివాళులు మన భారత్, తలమడుగు: తలమడుగు మండలం...

More like this