వడ దెబ్బతో కూలీ మృతి ..

Published on

-Advertisement-

మన భారత్ , ఆదిలాబాద్: 

జిల్లాలోని ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్న వేళ వడ దెబ్బ కారణంగా మరో విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం, భీంపూర్ మండలంలోని అర్లి టి గ్రామానికి చెందిన టేకం గజనన్ (38) అనే వ్యవసాయ కూలీ తీవ్ర వడ దెబ్బకు గురయ్యాడు. బుధవారం పని సమయంలోనే అస్వస్థతకు లోనైన ఆయనను కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అత్యవసరంగా రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

అయితే రెండు రోజులుగా చికిత్స పొందుతూ ఉన్న గజనన్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. కుటుంబం ఆర్థికంగా బలహీనంగా ఉండటంతో గ్రామస్తులు, బంధువులు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.

వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఉపాధి కూలీలు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే వారు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. మధ్యాహ్న వేళల్లో పనులు తగ్గించుకోవడం, ఎక్కువగా నీరు తాగడం, తల కప్పుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఈ ఘటనతో గ్రామ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రభుత్వం ఇలాంటి బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందించాలని స్థానికులు కోరుతున్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

నిరుపేద విద్యార్థులకు అండగా బీఎస్పీ..

పేద విద్యార్థులకు బీఎస్పీ విద్యా సామగ్రి పంపిణీ ఆదిలాబాద్:మన భారత్ ఆగస్టు 24, పేద, నిరుపేద విద్యార్థులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో...

బండారి కొమురయ్య సంవత్సరీకంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర

బండారి కొమురయ్య సంవత్సరీకంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర మన భారత్,మొగుళ్ళపల్లి: మొగుల్లపల్లి మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, తాపీ...

ప్లాట్ విక్రయిస్తానని రూ.5.70 లక్షలు వసూలు..

రియల్ ఎస్టేట్ ఏజెంట్ అరెస్ట్ ఆదిలాబాద్, మన భారత్, ఆగస్టు 23: ప్లాట్ విక్రయిస్తానని నమ్మించి లక్షల రూపాయలు వసూలు...

అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు: సీఐ

తలమడుగులో 300 కిలోల పిడిఎస్ బియ్యం పట్టివేత.. ఒకరి అరెస్ట్ తలమడుగు, ఆగస్టు 23: పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్‌ (PDS)...

More like this

నిరుపేద విద్యార్థులకు అండగా బీఎస్పీ..

పేద విద్యార్థులకు బీఎస్పీ విద్యా సామగ్రి పంపిణీ ఆదిలాబాద్:మన భారత్ ఆగస్టు 24, పేద, నిరుపేద విద్యార్థులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో...

బండారి కొమురయ్య సంవత్సరీకంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర

బండారి కొమురయ్య సంవత్సరీకంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర మన భారత్,మొగుళ్ళపల్లి: మొగుల్లపల్లి మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, తాపీ...

ప్లాట్ విక్రయిస్తానని రూ.5.70 లక్షలు వసూలు..

రియల్ ఎస్టేట్ ఏజెంట్ అరెస్ట్ ఆదిలాబాద్, మన భారత్, ఆగస్టు 23: ప్లాట్ విక్రయిస్తానని నమ్మించి లక్షల రూపాయలు వసూలు...