ఇదేం రోగం.. ఆర్డీవో అరెస్ట్.!

Published on

-Advertisement-

మన భారత్, నారాయణపేట:

నారాయణపేట జిల్లాలో అవినీతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జిల్లా ఆర్డీఓ రామచందర్ నాయక్ మంగళవారం రూ.25 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ ఘటనతో జిల్లాలో కలకలం రేగింది.

ఏసీబీ డీఎస్పీ సీ.హెచ్ బాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆపరేషన్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. లంచం స్వీకరిస్తున్న సమయంలో పట్టుబడిన రామచందర్ నాయక్‌పై కేసు నమోదు చేసి, తదుపరి చర్యలు ప్రారంభించారు.

ఈ కేసుతో సంబంధంగా నారాయణపేట జిల్లా కేంద్రంలోని బాబా కాలనీలో ఉన్న నివాసం, కార్యాలయాల్లో ఏసీబీ బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. అంతేకాకుండా, ఆయన గతంలో పనిచేసిన ప్రాంతాల్లో కూడా అవినీతి ఆరోపణలు ఉన్నట్లు సమాచారం.

గద్వాల జిల్లాలో ఆర్డీఓగా విధులు నిర్వహించిన సమయంలో లేని భూములకు ఓఆర్‌సీలు మంజూరు చేసి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అంశాలపై కూడా ఏసీబీ అధికారులు సమగ్రంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పలు జిల్లాల్లో పనిచేసిన సమయంలో జరిగిన లావాదేవీలపై సంబంధిత అధికారుల నుంచి నివేదికలు కోరినట్లు సమాచారం.

అలాగే, బినామీ పేర్లతో అక్రమ ఆస్తులు కూడబెట్టిన అనుమానంతో ఆయనకు అనుబంధంగా ఉన్న వ్యక్తుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశముంది.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

సూపర్ నారీ పై అవగాహన సదస్సులు..

మన భారత్, విజయనగరం:  గ్రామ సంఘాల్లో “మన డబ్బులు – మన లెక్కలు” సభ్యుల ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంపే...

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై నారాయణరావు

మన భారత్, విజయనగరం:  రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన సదస్సు గుర్ల, జూన్ 6: గుర్ల మండల కేంద్రంలో...

ప్రమాదాల నివారణకు పోలీసుల వినూత్న ప్రయోగం

మన భారత్, విజయనగరం: పాత టైర్లతో స్పీడ్ లిమిట్ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు డెంకాడ, జూన్ 6: రోడ్డు ప్రమాదాల నివారణే...

లో లెవల్ వంతెనల పూర్తి ఎప్పుడో.?

మన భారత్, ఆదిలాబాద్:  ఝరి, డోర్లి గ్రామాల ప్రజల ఆవేదన – వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులు తలమడుగు: తలమడుగు మండల...

More like this

సూపర్ నారీ పై అవగాహన సదస్సులు..

మన భారత్, విజయనగరం:  గ్రామ సంఘాల్లో “మన డబ్బులు – మన లెక్కలు” సభ్యుల ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంపే...

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై నారాయణరావు

మన భారత్, విజయనగరం:  రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన సదస్సు గుర్ల, జూన్ 6: గుర్ల మండల కేంద్రంలో...

ప్రమాదాల నివారణకు పోలీసుల వినూత్న ప్రయోగం

మన భారత్, విజయనగరం: పాత టైర్లతో స్పీడ్ లిమిట్ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు డెంకాడ, జూన్ 6: రోడ్డు ప్రమాదాల నివారణే...