డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తులు షురూ.!

Published on

-Advertisement-

మన భారత్, తెలంగాణ: 

బీసీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

బీసీ గురుకులాల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు తమకు సంబంధిత కాలేజీ ప్రిన్సిపాల్ ద్వారా డిగ్రీ కోర్సులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర విద్యాసంస్థల్లో ఇంటర్ పూర్తి చేసి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాల్సిందిగా సూచించారు. దరఖాస్తుల సమర్పణకు మే 10 చివరి తేదీగా నిర్ణయించారు.

ఇంటర్ మార్కుల మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు జరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులు సమయానికి దరఖాస్తులు పూర్తి చేసి అవసరమైన పత్రాలు సమర్పించాలని తెలిపారు.

ఆన్లైన్ లో.. mjptbcwreis.https://telangana.gov.in

ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం 040-23328266 ఫోన్ నంబర్ ద్వారా సంప్రదించాలని కార్యదర్శి సూచించారు. విద్యార్థుల ఉన్నత విద్యకు గురుకుల కాలేజీలు ఉత్తమ వేదికగా నిలుస్తాయని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

బీసీలకు 42% రిజర్వేషన్లకు పోరాటం..

మన భారత్, మొగులపల్లి: బీసీ సమాజానికి 42 శాతం రిజర్వేషన్ల అమలుకు కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకురావాలని బీసీ...

గవర్నర్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..

మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం లోక్‌భవన్‌లో...

వేధిస్తున్న ఎండలు.. వడదెబ్బతో మరణాలు

మన భారత్, తెలంగాణ:  రాష్ట్రవ్యాప్తంగా భానుడి భగభగలతో పగటి ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీల...

కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే..

మన భారత్, ఆదిలాబాద్: నెరడిగొండ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో నాఫెడ్ సహకారంతో, తెలంగాణ రాష్ట్ర మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో పీఏసీఎస్...

More like this

బీసీలకు 42% రిజర్వేషన్లకు పోరాటం..

మన భారత్, మొగులపల్లి: బీసీ సమాజానికి 42 శాతం రిజర్వేషన్ల అమలుకు కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకురావాలని బీసీ...

గవర్నర్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..

మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం లోక్‌భవన్‌లో...

వేధిస్తున్న ఎండలు.. వడదెబ్బతో మరణాలు

మన భారత్, తెలంగాణ:  రాష్ట్రవ్యాప్తంగా భానుడి భగభగలతో పగటి ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీల...