మన భారత్, ఆత్మకూరు:
ప్రజల త్రాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ఆత్మకూరు మున్సిపాలిటీ కేంద్రంలోని ఆరవ వార్డులో కీలక చర్యలు చేపట్టారు. స్థానికంగా నెలకొన్న నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని వీజేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు కొత్త బోర్లు ఏర్పాటు చేయడానికి భూమిపూజ కార్యక్రమం బుధవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఫౌండేషన్ అధినేత Varkatam Jagannath Reddy ప్రధానంగా హాజరయ్యారు. స్థానిక కౌన్సిలర్లు భరత్, నరేందర్లతో కలిసి భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ప్రతి బోర్కు సుమారు రూ.50 వేల వ్యయం అవుతుండగా, పైపులైన్తో కలిపి మొత్తం లక్ష రూపాయల ఖర్చుతో ఈ ప్రాజెక్టును పూర్తి చేయనున్నట్లు తెలిపారు.
ఈ బోర్ల ఏర్పాటు ద్వారా ఆరవ వార్డులో త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఈ సమస్యకు పరిష్కారం దొరకడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్లు ఫౌండేషన్ అధినేత జగన్నాథ్ రెడ్డి ని ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి వెంటనే స్పందించడం అభినందనీయమని పేర్కొన్నారు.
వీజేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్తులో కూడా ప్రజల మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తామని స్పష్టం చేశారు.
రాజకీయ నాయకులకు శుభవార్త..!
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
