మన భారత్, విజయపుర:
కుమారుడికి తన పోలికలు రాలేదన్న అనుమానంతో ఓ తండ్రి తన సొంత బిడ్డ ప్రాణాలు తీశాడు. కర్ణాటక రాష్ట్రంలోని విజయపుర జిల్లా నాగఠాణె గ్రామంలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన మల్లికార్జున, భాగ్యశ్రీ దంపతులకు సిద్ధార్థ (6) అనే ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడు. అయితే బాలుడు తన పోలికలు లేవన్న అనుమానం మల్లికార్జునకు గత ఏడాదిన్నరగా వేధిస్తోంది. ఈ అనుమానంతో అతను మానసికంగా అసహనానికి లోనయ్యాడు.
మార్చి 16న కుమారుడిని పాఠశాలలో చేర్పిస్తానని భార్యకు చెప్పిన మల్లికార్జున, సిద్ధార్థను తీసుకుని మహారాష్ట్రలోని మడీలి భికేశ్వర గ్రామ సమీపానికి వెళ్లాడు. అక్కడ కృష్ణానదిలోకి బాలుడిని తోసి హత్య చేశాడు. అనంతరం ఇంటికి వచ్చి బాలుడిని హాస్టల్లో చేర్పించి వచ్చానని భార్యను నమ్మించాడు.
రెండు రోజుల తరువాత, మార్చి 18న కృష్ణానదిలో బాలుడి మృతదేహం లభించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. కుమారుడి గురించి అనుమానం కలిగిన భాగ్యశ్రీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభమైంది. విచారణలో నిజాలు బయటపడటంతో పోలీసులు మల్లికార్జునను అరెస్టు చేశారు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కుటుంబ సంబంధాల్లో అనుమానాలు ఎంతటి దారుణాలకు దారి తీస్తాయో ఈ సంఘటన మరోసారి చాటిచెప్పింది.
రాజకీయ నాయకులకు శుభవార్త..!
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
