జర్నలిస్టులకు శుభవార్త..!

Published on

-Advertisement-

మన భారత్, తెలంగాణ:

అర్హులైన జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు జారీ చేసే ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు సమాచారం పౌరసంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సిహెచ్. ప్రియాంక వెల్లడించారు. అక్రెడిటేషన్ కోసం దరఖాస్తుల స్వీకరణ నిరంతరం కొనసాగుతోందని, దీనిపై వస్తున్న వివిధ వార్తలతో జర్నలిస్టులు ఆందోళన చెందవద్దని ఆమె స్పష్టం చేశారు.

ఈ నెల 10వ తేదీన రాష్ట్ర స్థాయి అక్రెడిటేషన్ కమిటీ సమావేశం నిర్వహించి, ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులపై సమగ్ర పరిశీలన (స్క్రూటినీ) చేపట్టనున్నట్లు తెలిపారు. అర్హత ప్రమాణాలు పూర్తి చేసిన జర్నలిస్టులకు కొత్త అక్రెడిటేషన్ కార్డులను మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు.

అక్రెడిటేషన్ కోసం జర్నలిస్టులు తప్పనిసరిగా ఆన్లైన్‌లో దరఖాస్తులు అప్లోడ్ చేయాలని సూచించారు. ఏప్రిల్ నెలలోనే మొత్తం అక్రెడిటేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

ఇక జిల్లా స్థాయిలో కూడా ఈ నెలలోనే అక్రెడిటేషన్ కమిటీ సమావేశాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జిల్లాల వారీగా అర్హులైన జర్నలిస్టులను గుర్తించి వారికి అక్రెడిటేషన్ కార్డులు జారీ చేసే ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.

అర్హత ఉన్న జర్నలిస్టులు ఆలస్యం చేయకుండా వెంటనే ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

రాజకీయ నాయకులకు శుభవార్త.!

https://manabharath.com/7179/

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

బీసీ మహిళా మంత్రి కొండా సురేఖకు ప్రోటోకాల్ వర్తించదా? రేవంత్ జీ

-సామాజిక న్యాయం అంటే ఇదేనా? రాహుల్ జీ -బీసీలను గౌరవించడమంటే బీసీ ప్రజా ప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించకపోవడమేనా? -ఫ్లెక్సీలో బీసీ మంత్రి...

బీఆర్ఎస్ 10 ఏళ్ల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే సమరభేరి డ్రామా

- కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము మన భారత్,మొగుళ్ళపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి...

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

గిరిజనుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే

వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజల హక్కులకు ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల జీవనోపాధి, అభివృద్ధి అవసరం: ఎమ్మెల్యే...

More like this

బీసీ మహిళా మంత్రి కొండా సురేఖకు ప్రోటోకాల్ వర్తించదా? రేవంత్ జీ

-సామాజిక న్యాయం అంటే ఇదేనా? రాహుల్ జీ -బీసీలను గౌరవించడమంటే బీసీ ప్రజా ప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించకపోవడమేనా? -ఫ్లెక్సీలో బీసీ మంత్రి...

బీఆర్ఎస్ 10 ఏళ్ల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే సమరభేరి డ్రామా

- కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము మన భారత్,మొగుళ్ళపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి...

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...