బాలామృతంతో పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం

Published on

-Advertisement-

మన భారత్, మొగులపల్లి:

అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే బాలామృతం పిల్లల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఐసీడీఎస్ సూపర్వైజర్ సుజాత పేర్కొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగులపల్లి మండలంలోని పర్లపల్లి సెక్టార్ పరిధిలోని పెద్దకోమటిపల్లి అంగన్వాడీ కేంద్రంలో సోమవారం బాలామృతం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సుజాత మాట్లాడుతూ, 6 నెలల నుండి 3 సంవత్సరాల వయస్సు గల చిన్నారులు, అలాగే కిశోర బాలికలకు బాలామృతం మరియు చిక్కి ప్యాకెట్లను అందిస్తున్నట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందించే ఆహారంలో అనేక విటమిన్లు, పోషకాలు ఉండి పిల్లల శారీరక, మానసిక అభివృద్ధికి దోహదపడతాయని వివరించారు.

కిశోర బాలికలు రక్తహీనత సమస్యకు గురికాకుండా ఉండేందుకు చిక్కి ప్యాకెట్లను సరఫరా చేస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ అంగన్వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ సందర్భంగా తల్లుల సమక్షంలో పిల్లల ఎత్తు, బరువులను కొలిచి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు.

ప్రతి నెల పిల్లల ఎదుగుదలను గమనించడం చాలా అవసరమని, 3 నుండి 6 సంవత్సరాల పిల్లలను క్రమం తప్పకుండా అంగన్వాడీ కేంద్రాలకు పంపాలని తల్లులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ పుష్పలత, స్కూల్ టీచర్ సుమలత, తల్లులు, పిల్లలు, కిశోర బాలికలు మరియు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

రాజకీయ నాయకులకు శుభవార్త..!

https://manabharath.com/7179/

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Latest articles

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...

ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి...

ఆటో డ్రైవర్ భార్య అద్భుత ప్రతిభ.!

ఆంధ్రప్రదేశ్, ఆదోని, మన భారత్: ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పట్టుదలతో చదివితే విజయం సాధించవచ్చని మరోసారి నిరూపించారు కర్నూల్ జిల్లా...

More like this

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...

ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి...