వేడుకల్లో పాల్గొన్న మాజీ జడ్పీటీసీ..

Published on

-Advertisement-

మన భారత్, తలమడుగు :

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని కజ్జర్ల గ్రామంలో మిలటరీ మెన్ తలార్ల కిరణ్ గృహ ప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ జెడ్పిటిసి గోక గణేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఇంట్లో సుఖశాంతులు నెలకొని, కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు కూడా కార్యక్రమంలో పాల్గొని తలార్ల కిరణ్ కుటుంబాన్ని అభినందించారు. దేశ సేవలో ఉన్న సైనికులు గ్రామానికి గర్వకారణమని, వారి సేవలు అందరికీ ఆదర్శమని గోక గణేష్ రెడ్డి పేర్కొన్నారు.

అనంతరం బోరిగామ గ్రామానికి చెందిన బద్దం స్వామినాథరెడ్డి కుమార్తె వివాహ కార్యక్రమానికి కూడా మాజీ జెడ్పిటిసి గోక గణేష్ రెడ్డి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడి వారికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమాల్లో కజ్జర్ల గ్రామ సర్పంచ్ ఎల్మా నారాయణరెడ్డి, ఉప సర్పంచ్ గంగన్న, మాజీ ఎంపీటీసీ పూర్ణచందర్, ఎం. పోశెట్టి, తిరుపతి, సంతోష్, నారాయణ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

గ్రామంలో జరిగిన ఈ రెండు కార్యక్రమాలు ఆనందోత్సాహాల మధ్య జరిగాయి.

Mana Bharath – Leading News Portal

Latest articles

వీజేఆర్ ఫౌండేషన్ సేవలు మరువలేనివి..

మన భారత్, నారాయణపేట: ఆత్మకూరు పట్టణంలోని ఆరవ వార్డులో నెలకొన్న త్రాగునీటి సమస్యకు వీజేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శాశ్వత పరిష్కారం...

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...

ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి...

More like this

వీజేఆర్ ఫౌండేషన్ సేవలు మరువలేనివి..

మన భారత్, నారాయణపేట: ఆత్మకూరు పట్టణంలోని ఆరవ వార్డులో నెలకొన్న త్రాగునీటి సమస్యకు వీజేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శాశ్వత పరిష్కారం...

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...