సనాతన ధర్మ పరిరక్షకుడు శివాజీ మహారాజ్..

Published on

-Advertisement-

మన భారత్, ఆదిలాబాద్:

తలమడుగు మండలం దేవాపూర్ గ్రామంలో సనాతన ధర్మ పరిరక్షకుడు, హిందూ సామ్రాజ్య స్థాపకుడు హిందూ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు.శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి, దేశభక్తి నినాదాలతో శోభాయాత్ర చేపట్టారు.

సర్పంచ్ పోరండ్ల సంతోష్, పూజారి శివాజీ పంతులుతో కలిసి వేద మంత్రాలతో పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం గ్రామ ప్రధాన వీధుల్లో శోభాయాత్ర నిర్వహిస్తూ శివాజీ మహారాజ్ స్ఫూర్తిదాయక జీవితం, ధైర్యసాహసాలు, పరిపాలనా నైపుణ్యాన్ని గుర్తుచేసుకున్నారు. యువత పెద్ద సంఖ్యలో పాల్గొని దేశభక్తి గీతాలతో వేడుకలకు ఉత్సాహాన్ని జోడించారు.

గ్రామ సర్పంచ్ పోరండ్ల సంతోష్ మాట్లాడుతూ శివాజీ మహారాజ్ ఆశయాలు నేటి తరానికి మార్గదర్శకమని అన్నారు. ఉప సర్పంచ్ మేకల శ్రీరామ్, శానం శ్రీనివాస్, బీజేపీ యువమోర్చ తలమడుగు అధ్యక్షులు దాతజీ కిరణ్ తదితరులు శివాజీ మహారాజ్ పరాక్రమాన్ని కొనియాడారు. హిందూ సమాజ ఐక్యతకు ఆయన జీవితం ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అడెపు శ్రీను, గంధం నరేష్, పులవేణి గణేష్, రేగుల మోహన్, సీపతి నగేష్, గొల్లని మోహన్, నాయిని పొచన్న, పోరండ్ల రాములు, గోనె శ్రీనివాస్, పోతుగంటి అశోక్, ఓస రవి, శాగంటి విష్ణు, నాయిని నవీన్, సంఘర్తి నారాయణ, నాపెళ్ళి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ యువకులు, హిందూ బంధువులు భారీగా హాజరై వేడుకలను విజయవంతం చేశారు.

శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా గ్రామంలో దేశభక్తి వాతావరణం నెలకొని, యువతలో జాతీయ చైతన్యం పెంపొందించాల్సిన అవసరాన్ని నాయకులు ప్రస్తావించారు.

Latest articles

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...

ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి...

ఆటో డ్రైవర్ భార్య అద్భుత ప్రతిభ.!

ఆంధ్రప్రదేశ్, ఆదోని, మన భారత్: ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పట్టుదలతో చదివితే విజయం సాధించవచ్చని మరోసారి నిరూపించారు కర్నూల్ జిల్లా...

More like this

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...

ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి...