మన భారత్, ఆదిలాబాద్:
తలమడుగు మండలం దేవాపూర్ గ్రామంలో సనాతన ధర్మ పరిరక్షకుడు, హిందూ సామ్రాజ్య స్థాపకుడు హిందూ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు.శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి, దేశభక్తి నినాదాలతో శోభాయాత్ర చేపట్టారు.
సర్పంచ్ పోరండ్ల సంతోష్, పూజారి శివాజీ పంతులుతో కలిసి వేద మంత్రాలతో పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం గ్రామ ప్రధాన వీధుల్లో శోభాయాత్ర నిర్వహిస్తూ శివాజీ మహారాజ్ స్ఫూర్తిదాయక జీవితం, ధైర్యసాహసాలు, పరిపాలనా నైపుణ్యాన్ని గుర్తుచేసుకున్నారు. యువత పెద్ద సంఖ్యలో పాల్గొని దేశభక్తి గీతాలతో వేడుకలకు ఉత్సాహాన్ని జోడించారు.

గ్రామ సర్పంచ్ పోరండ్ల సంతోష్ మాట్లాడుతూ శివాజీ మహారాజ్ ఆశయాలు నేటి తరానికి మార్గదర్శకమని అన్నారు. ఉప సర్పంచ్ మేకల శ్రీరామ్, శానం శ్రీనివాస్, బీజేపీ యువమోర్చ తలమడుగు అధ్యక్షులు దాతజీ కిరణ్ తదితరులు శివాజీ మహారాజ్ పరాక్రమాన్ని కొనియాడారు. హిందూ సమాజ ఐక్యతకు ఆయన జీవితం ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అడెపు శ్రీను, గంధం నరేష్, పులవేణి గణేష్, రేగుల మోహన్, సీపతి నగేష్, గొల్లని మోహన్, నాయిని పొచన్న, పోరండ్ల రాములు, గోనె శ్రీనివాస్, పోతుగంటి అశోక్, ఓస రవి, శాగంటి విష్ణు, నాయిని నవీన్, సంఘర్తి నారాయణ, నాపెళ్ళి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ యువకులు, హిందూ బంధువులు భారీగా హాజరై వేడుకలను విజయవంతం చేశారు.
శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా గ్రామంలో దేశభక్తి వాతావరణం నెలకొని, యువతలో జాతీయ చైతన్యం పెంపొందించాల్సిన అవసరాన్ని నాయకులు ప్రస్తావించారు.
