మార్చి 15లోపు పరిషత్ ఎన్నికలు నిర్వహించకపోతే రూ.450 కోట్ల నిధులు ప్రమాదంలో.?

Published on

-Advertisement-

మన భారత్, హైదరాబాద్:

తెలంగాణలో పరిషత్ ఎన్నికల నిర్వహణపై అనిశ్చితి నెలకొంది. కేంద్ర ఆర్థిక సంఘం నుంచి రాష్ట్రానికి రావాల్సిన సుమారు రూ.450 కోట్ల నిధులు ఎన్నికల నిర్వహణతో అనుసంధానమై ఉండటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

సూచనల ప్రకారం, మార్చి 15లోపు పరిషత్ ఎన్నికలు నిర్వహించకపోతే ఆ నిధులు విడుదలలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో విద్యార్థుల టెన్త్ ప్రీ-ఫైనల్ పరీక్షలు కొనసాగుతుండగా, మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు వార్షిక పరీక్షలు నిర్వహించనున్న షెడ్యూల్ ఉంది. పరీక్షల సమయంలో ఎన్నికలు నిర్వహించడం పరిపాలనా, భద్రతా పరమైన సవాళ్లకు దారి తీసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఎన్నికలను ముందుగానే నిర్వహించాలా, లేక పరీక్షల అనంతరం నిర్వహించాలా అన్న అంశంపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. పరిపాలనా యంత్రాంగం, ఎన్నికల అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

ఈ నెల 23న జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

Latest articles

కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న బలం..

ఆదిలాబాద్‌లో కాంగ్రెస్‌కు భారీ బలం డీసీసీ అధ్యక్షుడు డా. నరేష్ జాదవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బీజేపీ నాయకులు కన్య...

గ్రామాల అభివృద్ధే రాష్ట్రాభివృద్ధికి పునాది: సర్పంచ్ నిఖిత

అమరుల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం సఖినాపూర్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్ర గీతాలాపనతో అమరవీరులకు నివాళులు...

అమరుల త్యాగ ఫలితమే స్వరాష్ట్రం..

కుచులాపూర్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జాతీయ పతాకావిష్కరణతో అమరవీరులకు నివాళులు – పారిశుద్ధ్య కార్మికులకు సేఫ్టీ...

తెలంగాణ సాధనలో యువత త్యాగాలు చిరస్మరణీయం

పల్లి (బి) గ్రామంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అమరవీరులకు నివాళులు అర్పించిన గ్రామ ప్రజలు మన భారత్,...

More like this

కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న బలం..

ఆదిలాబాద్‌లో కాంగ్రెస్‌కు భారీ బలం డీసీసీ అధ్యక్షుడు డా. నరేష్ జాదవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బీజేపీ నాయకులు కన్య...

గ్రామాల అభివృద్ధే రాష్ట్రాభివృద్ధికి పునాది: సర్పంచ్ నిఖిత

అమరుల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం సఖినాపూర్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్ర గీతాలాపనతో అమరవీరులకు నివాళులు...

అమరుల త్యాగ ఫలితమే స్వరాష్ట్రం..

కుచులాపూర్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జాతీయ పతాకావిష్కరణతో అమరవీరులకు నివాళులు – పారిశుద్ధ్య కార్మికులకు సేఫ్టీ...