అనుమతి లేకుండా విజయోత్సవ ర్యాలీ.. 44వ వార్డు కౌన్సిలర్‌పై కేసు నమోదు

Published on

-Advertisement-

మన భారత్, ఆదిలాబాద్:

ఆదిలాబాద్ పట్టణంలోని బుక్తాపూర్ ప్రాంతంలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 44వ వార్డులో గెలుపొందిన ఎంఐఎం అభ్యర్థి మహమ్మద్ రోహిత్‌పై కేసు నమోదు చేసినట్లు 2 టౌన్ సీఐ నాగరాజు వెల్లడించారు.

విజయోత్సవం సందర్భంగా అనుమతి లేకుండా డీజేతో ర్యాలీ నిర్వహించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో షేక్ షోహిబ్, షేక్ ఇమ్రాన్‌తో పాటు మరికొందరిపై కూడా కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ర్యాలీలో ఉపయోగించిన ఆటో, డీజే సౌండ్ సిస్టమ్‌ను సీజ్ చేసినట్లు వివరించారు.

ఎన్నికల సమయంలో చట్టం, నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని సీఐ నాగరాజు స్పష్టం చేశారు. ఎవరు అయినా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. ఎన్నికల అనంతర వేడుకల విషయంలో అనుమతులు తీసుకుని చట్టబద్ధంగా కార్యక్రమాలు నిర్వహించాలని పోలీసులు సూచించారు.

Latest articles

కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న బలం..

ఆదిలాబాద్‌లో కాంగ్రెస్‌కు భారీ బలం డీసీసీ అధ్యక్షుడు డా. నరేష్ జాదవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బీజేపీ నాయకులు కన్య...

గ్రామాల అభివృద్ధే రాష్ట్రాభివృద్ధికి పునాది: సర్పంచ్ నిఖిత

అమరుల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం సఖినాపూర్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్ర గీతాలాపనతో అమరవీరులకు నివాళులు...

అమరుల త్యాగ ఫలితమే స్వరాష్ట్రం..

కుచులాపూర్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జాతీయ పతాకావిష్కరణతో అమరవీరులకు నివాళులు – పారిశుద్ధ్య కార్మికులకు సేఫ్టీ...

తెలంగాణ సాధనలో యువత త్యాగాలు చిరస్మరణీయం

పల్లి (బి) గ్రామంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అమరవీరులకు నివాళులు అర్పించిన గ్రామ ప్రజలు మన భారత్,...

More like this

కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న బలం..

ఆదిలాబాద్‌లో కాంగ్రెస్‌కు భారీ బలం డీసీసీ అధ్యక్షుడు డా. నరేష్ జాదవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బీజేపీ నాయకులు కన్య...

గ్రామాల అభివృద్ధే రాష్ట్రాభివృద్ధికి పునాది: సర్పంచ్ నిఖిత

అమరుల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం సఖినాపూర్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్ర గీతాలాపనతో అమరవీరులకు నివాళులు...

అమరుల త్యాగ ఫలితమే స్వరాష్ట్రం..

కుచులాపూర్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జాతీయ పతాకావిష్కరణతో అమరవీరులకు నివాళులు – పారిశుద్ధ్య కార్మికులకు సేఫ్టీ...