అనుమతి లేకుండా విజయోత్సవ ర్యాలీ.. 44వ వార్డు కౌన్సిలర్‌పై కేసు నమోదు

Published on

-Advertisement-

మన భారత్, ఆదిలాబాద్:

ఆదిలాబాద్ పట్టణంలోని బుక్తాపూర్ ప్రాంతంలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 44వ వార్డులో గెలుపొందిన ఎంఐఎం అభ్యర్థి మహమ్మద్ రోహిత్‌పై కేసు నమోదు చేసినట్లు 2 టౌన్ సీఐ నాగరాజు వెల్లడించారు.

విజయోత్సవం సందర్భంగా అనుమతి లేకుండా డీజేతో ర్యాలీ నిర్వహించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో షేక్ షోహిబ్, షేక్ ఇమ్రాన్‌తో పాటు మరికొందరిపై కూడా కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ర్యాలీలో ఉపయోగించిన ఆటో, డీజే సౌండ్ సిస్టమ్‌ను సీజ్ చేసినట్లు వివరించారు.

ఎన్నికల సమయంలో చట్టం, నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని సీఐ నాగరాజు స్పష్టం చేశారు. ఎవరు అయినా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. ఎన్నికల అనంతర వేడుకల విషయంలో అనుమతులు తీసుకుని చట్టబద్ధంగా కార్యక్రమాలు నిర్వహించాలని పోలీసులు సూచించారు.

Latest articles

కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా..

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా -వెయ్యి రోజుల సంబరాలకు ముందు బీసీలకు ఇచ్చిన హామీలపై...

బీసీ మహిళా మంత్రి కొండా సురేఖకు ప్రోటోకాల్ వర్తించదా? రేవంత్ జీ

-సామాజిక న్యాయం అంటే ఇదేనా? రాహుల్ జీ -బీసీలను గౌరవించడమంటే బీసీ ప్రజా ప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించకపోవడమేనా? -ఫ్లెక్సీలో బీసీ మంత్రి...

బీఆర్ఎస్ 10 ఏళ్ల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే సమరభేరి డ్రామా

- కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము మన భారత్,మొగుళ్ళపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి...

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

More like this

కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా..

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా -వెయ్యి రోజుల సంబరాలకు ముందు బీసీలకు ఇచ్చిన హామీలపై...

బీసీ మహిళా మంత్రి కొండా సురేఖకు ప్రోటోకాల్ వర్తించదా? రేవంత్ జీ

-సామాజిక న్యాయం అంటే ఇదేనా? రాహుల్ జీ -బీసీలను గౌరవించడమంటే బీసీ ప్రజా ప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించకపోవడమేనా? -ఫ్లెక్సీలో బీసీ మంత్రి...

బీఆర్ఎస్ 10 ఏళ్ల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే సమరభేరి డ్రామా

- కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము మన భారత్,మొగుళ్ళపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి...