అనుమతి లేకుండా విజయోత్సవ ర్యాలీ.. 44వ వార్డు కౌన్సిలర్పై కేసు నమోదు
మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని బుక్తాపూర్ ప్రాంతంలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 44వ వార్డులో గెలుపొందిన ఎంఐఎం అభ్యర్థి మహమ్మద్ రోహిత్పై కేసు నమోదు చేసినట్లు 2 టౌన్ సీఐ నాగరాజు వెల్లడించారు. విజయోత్సవం సందర్భంగా అనుమతి లేకుండా డీజేతో ర్యాలీ నిర్వహించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో షేక్ షోహిబ్, షేక్ ఇమ్రాన్తో పాటు మరికొందరిపై కూడా కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు....