మున్సిపల్ ఎన్నికల శంఖం పూరించిన సీఎం..

Published on

-Advertisement-

మన భారత్, తెలంగాణ: రానున్న మున్సిపల్ ఎన్నికలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు వేదికగా సమరశంఖం పూరించారు. ప్రజల మధ్యకు వెళ్లి అభివృద్ధి, సంక్షేమం ఆధారంగా ఎన్నికలను ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

డబుల్ బెడ్రూమ్ ఇళ్ల అంశంపై మాజీ సీఎం కేసీఆర్‌కు సీఎం రేవంత్ సవాల్ విసిరారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల వద్దకు వెళ్లి బీఆర్ఎస్ ఓట్లు అడగాలని కేసీఆర్‌ను ప్రశ్నించారు. తన సవాలును స్వీకరించే ధైర్యం ఉందా అని నిలదీశారు. ఇందిరమ్మ ఇళ్లు ఉన్న గ్రామాలు, పట్టణాల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడుగుతుందని స్పష్టంగా ప్రకటించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని సీఎం రేవంత్ తెలిపారు. పేదల కోసం ఇళ్ల నిర్మాణం, మౌలిక వసతుల అభివృద్ధి, పట్టణాల ప్రగతే తమ అజెండా అని అన్నారు. మాటల రాజకీయాలు కాకుండా పనితోనే ప్రజల మద్దతు సంపాదిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల కోసం నిజాయితీగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని సీఎం రేవంత్ ఓటర్లను కోరారు. ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించేవిగా ఉంటాయని పేర్కొంటూ, ప్రజల తీర్పుతోనే అభివృద్ధికి కొత్త దిశ చూపుతామని అన్నారు.

Latest articles

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం – ఆత్మగౌరవ పోరాటానికి విజయ చిహ్నం

మన భారత్ , ఆదిలాబాద్:  తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష, దశాబ్దాల పోరాటాల ఫలితంగా 2014 జూన్ 2న తెలంగాణ...

రవితేజ కష్టం ఫలించింది..!

అగ్నివీర్ ఫలితాల్లో సత్తా చాటిన కౌఠ (బీ) గ్రామానికి చెందిన రవితేజ యువతకు ఆదర్శంగా నిలిచిన గ్రామీణ ప్రతిభ మన భారత్,...

నూతన గ్రామ కార్యదర్శి పశువైద్యాధికారికి సన్మానం

తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించిన దేవాపూర్ గ్రామపంచాయతీ ఎంపీడబ్ల్యూఎస్ సిబ్బందికి సేఫ్టీ కిట్ల పంపిణీ – గ్రామ అభివృద్ధికి...

వ్యవసాయ బావిలో పడి పులి మృతి..

దుర్వాసన రావడంతో బయటపడిన ఘటన.. శవపరీక్ష అనంతరం ఖననం మన భారత్, మహారాష్ట్ర: మహారాష్ట్ర రాష్ట్రంలోని చంద్రపూర్ జిల్లా బ్రహ్మపురి...

More like this

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం – ఆత్మగౌరవ పోరాటానికి విజయ చిహ్నం

మన భారత్ , ఆదిలాబాద్:  తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష, దశాబ్దాల పోరాటాల ఫలితంగా 2014 జూన్ 2న తెలంగాణ...

రవితేజ కష్టం ఫలించింది..!

అగ్నివీర్ ఫలితాల్లో సత్తా చాటిన కౌఠ (బీ) గ్రామానికి చెందిన రవితేజ యువతకు ఆదర్శంగా నిలిచిన గ్రామీణ ప్రతిభ మన భారత్,...

నూతన గ్రామ కార్యదర్శి పశువైద్యాధికారికి సన్మానం

తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించిన దేవాపూర్ గ్రామపంచాయతీ ఎంపీడబ్ల్యూఎస్ సిబ్బందికి సేఫ్టీ కిట్ల పంపిణీ – గ్రామ అభివృద్ధికి...